హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాజీ సహచరుడికి మైండ్ బ్లాంకయ్యే ఓటమిని రుచి చూపించేందుకు కేసీఆర్ అన్ని అస్త్రాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ దీనికి తోడుగా రాజకీయ పాచికలు సైతం వేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ లో కీలకమైన రెడ్డి, దళిత సామాజాకి వర్గం ఓట్లకు కొత్త ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. ఇందుకు ఇద్దరు సీనియర్లను కేసీఆర్ వాడుకుంటున్నారని అంటున్నారు.
తెలంగాణలో హుజురాబాద్ ఎన్నిక సృష్టిస్తున్న హీట్ అంతా ఇంత కాదు. ఈ ఎన్నికను ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు ప్రతిపక్ష బీజేపీ సైతం ఓ రేంజ్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి తగ్గట్లు ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేసిన సేవలను గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలపై విశ్వాసం ఉంచుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తోంది. అయితే, ఇక్కడితోనే సరిపోకుండా ఈ ఎన్నికను ప్రత్యేకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే దళిత బంధు వంటి వరాలను ప్రకటించారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటలను రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. మరోవైపు సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులు సైతం అదే రీతిలో కీలక ప్రకటన చేశారు. ఈటల ఓటమికి తన వంతు ప్రయత్నిస్తానన్నారు. ఇందుకోసం దండోరా కూడా వేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దళిత బంధు గురించి ఎంతో వివరంగా స్పందించారు. మొత్తంగా ఇటు దళిత నేత అటు రెడ్డి నేతతో కలిసి హుజురాబాద్లో టీఆర్ఎస్ ఓటమికి రెడ్డి+దళిత ఫార్ములాను అమలు చేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on July 30, 2021 12:24 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…