హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాజీ సహచరుడికి మైండ్ బ్లాంకయ్యే ఓటమిని రుచి చూపించేందుకు కేసీఆర్ అన్ని అస్త్రాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ దీనికి తోడుగా రాజకీయ పాచికలు సైతం వేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ లో కీలకమైన రెడ్డి, దళిత సామాజాకి వర్గం ఓట్లకు కొత్త ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. ఇందుకు ఇద్దరు సీనియర్లను కేసీఆర్ వాడుకుంటున్నారని అంటున్నారు.
తెలంగాణలో హుజురాబాద్ ఎన్నిక సృష్టిస్తున్న హీట్ అంతా ఇంత కాదు. ఈ ఎన్నికను ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు ప్రతిపక్ష బీజేపీ సైతం ఓ రేంజ్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి తగ్గట్లు ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేసిన సేవలను గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలపై విశ్వాసం ఉంచుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తోంది. అయితే, ఇక్కడితోనే సరిపోకుండా ఈ ఎన్నికను ప్రత్యేకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే దళిత బంధు వంటి వరాలను ప్రకటించారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటలను రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. మరోవైపు సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులు సైతం అదే రీతిలో కీలక ప్రకటన చేశారు. ఈటల ఓటమికి తన వంతు ప్రయత్నిస్తానన్నారు. ఇందుకోసం దండోరా కూడా వేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దళిత బంధు గురించి ఎంతో వివరంగా స్పందించారు. మొత్తంగా ఇటు దళిత నేత అటు రెడ్డి నేతతో కలిసి హుజురాబాద్లో టీఆర్ఎస్ ఓటమికి రెడ్డి+దళిత ఫార్ములాను అమలు చేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on July 30, 2021 12:24 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…