Political News

విశాఖ ఉక్కు.. ఎలా క‌వ‌ర్ చేద్దాం.. వైసీపీలో హీటెక్కిన చ‌ర్చ‌

వైసీపీలో నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు వేడెక్కాయి. ఇప్పుడు ఎలా ముందుకు సాగుదాం.. ప్ర‌జ‌ల‌ను ఎలా న‌మ్మిద్దాం! అంటూ.. నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇంత‌కీ ఏవిష‌యం అంటే.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌రణ అంశ‌మే! ఈ విష‌యంలో “మేం ఆపుతున్నాం.. కేంద్రాన్ని వేలు పెట్ట‌నివ్వం. మా ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే లేఖ‌లు సంధించారు. ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌రంగా రాజ‌కీయం.. రాద్ధాంతం చేస్తున్నాయి. మాకు మాత్రం విశాఖ ఉక్కుపై ప్రేమ లేదా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్య‌త ప్ర‌జ‌లు మాకు క‌దా ఇచ్చారు!” అంటూ.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌బుర్లు చెప్పిన వైసీపీనాయ‌కుల‌కు కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు షాకిస్తోంది.

ఇప్ప‌టికే తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో కూడా.. విశాఖ ఉక్కును నూటికి నూరు శాతం అమ్మేసే తీరుతామ‌ని.. కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విష‌యాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టి చెప్పింది. అంటే.. సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు రాసిన లేఖ‌లు.. వైసీపీ ఎంపీ.. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌.. సాయిరెడ్డి చేసిన పాద‌యాత్ర‌లు.. పార్ల‌మెంటులో చేసిన ప్ర‌సంగాలు అన్నీ.. కొట్టుకుపోయాయి. కేంద్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెప్పేసింది. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. వైసీపీని కుదిపేస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎంపీలు.. రాజీనామా చేసి.. కేంద్రానికి బుద్ధి చెప్ప‌యినా.. విశాఖ ఉక్కును నిలుపుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. “మేం రాజీనామాలు చేస్తాం.. మీరు కూడా చేయండి.. మీ నాయ‌క‌త్వంలోనే మా ఎంపీలు కూడా ప‌నిచేస్తారు. విశాఖ ఉక్కును కాపాడుకుందాం. రండి!” అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. అయితే.. వైసీపీ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. పైగా.. గ‌తంలో ప్ర‌త్యేక హోదా కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. రాజీనామాల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన‌.. జ‌గ‌న్‌.. ఇప్పుడు అదే అస్త్రం టీడీపీనుంచి వినిపించే స‌రికి.. తేలుకుట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.

కానీ, విశాఖ‌లో ప‌రిస్థితి చూస్తే..నానాటికీ తీవ్ర‌మ‌వుతోంది. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు ఉద్య‌మ బాట పట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా ఉద్యోగుల సెంటిమెంటుకు నేత‌లు ఫిదా అవుతున్నారు. ఈ స‌మ‌యంలో వైసీపీ కూడా గొంతు క‌ల‌ప‌క‌పోతే.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యంపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం.. ఇక్క‌డి ఎమ్మెల్యేలు.. ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారు? త‌మ త‌ప్పులేద‌ని.. త‌ప్పించుకుంటారా? లేక అసెంబ్లీలోనూ చేసిన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ వ్య‌తిరేక‌త తీర్మానానికి క‌ట్టుబ‌డి కేంద్రాన్ని నిల‌దీస్తారా? చూడాలి.

This post was last modified on July 30, 2021 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

21 minutes ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

1 hour ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

2 hours ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

4 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

4 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

4 hours ago