Political News

జగన్ తెగింపు ఆమెకు కొత్త టెన్షన్ గా మారిందా?

ఏదైనా విషయం అనుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకూ పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఎంతకైనా రెఢీ అనే తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో కాస్త ఎక్కువే. ఆయన్ను సన్నిహితంగా చూసే వారందరికి ఈ విషయం మీద అవగాహన ఎక్కువే. తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలనే పట్టుదల..ఇప్పుడు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కొత్త టెన్షన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.

కెరీర్ లో ఇప్పటివరకూ ఎలాంటి మచ్చ లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నీలం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా మారిన కాలం నుంచి రాజీ పడాల్సి వస్తోందంటున్నారు. గతంలో మాదిరి నిర్మోహమాటంగా వ్యవహరించటం లేదంటున్నారు. ఇప్పుడామెకు కొత్త కష్టం వచ్చినట్లుగా జోరైన ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల్ని వేస్తున్నట్లుగా ఫిర్యాదు రావట.. హైకోర్టు రియాక్టు కావటం తెలిసిందే.

అయినప్పటికీ తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కారుకు ఇటీవల హైకోర్టు మొట్టికాయ వేయటమే కాదు.. రంగులు మార్చని పక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు.. అధికారులపై చర్యలు తప్పవన్న ఘాటుగా రియాక్టు అయ్యింది ఏపీ హైకోర్టు. అంతేకాదు.. ఈ నెల 28న కోర్టుకు స్వయంగా వచ్చి.. ఈ వ్యవహారంపై అప్డేట్ ఇవ్వాలని చెప్పారు.

దీంతో..ఏపీ సీఎస్ నీలం సాహ్ని స్పందించారు. ఆదివారం సెలవును క్యాన్సిల్ చేసి.. ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసిన వివాదంతో పాటు.. హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కోర్టు ఆదేశాల్ని అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద ఇబ్బందులు తప్పవన్న విషయం మీద క్లారిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి.. ఇటు కోర్టుకు మధ్య నలిగిపోకుండా నిర్ణయాలు ఉంటే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి.

This post was last modified on May 25, 2020 1:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

2 hours ago

మెగా ఎఫెక్ట్‌.. క‌దిలిన ఇండ‌స్ట్రీ..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక స‌మ‌రం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్ర‌ధాన ప‌క్షాలైన‌.. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు దూకుడుగా ముందుకు…

3 hours ago

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి…

3 hours ago

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…

4 hours ago

‘పుష్ప’తో నాకొచ్చిందేమీ లేదు-ఫాహద్

మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…

5 hours ago

సీనియర్ దర్శకుడిని ఇలా అవమానిస్తారా

సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…

7 hours ago