Political News

జగన్ తెగింపు ఆమెకు కొత్త టెన్షన్ గా మారిందా?

ఏదైనా విషయం అనుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకూ పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఎంతకైనా రెఢీ అనే తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో కాస్త ఎక్కువే. ఆయన్ను సన్నిహితంగా చూసే వారందరికి ఈ విషయం మీద అవగాహన ఎక్కువే. తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలనే పట్టుదల..ఇప్పుడు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కొత్త టెన్షన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.

కెరీర్ లో ఇప్పటివరకూ ఎలాంటి మచ్చ లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నీలం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా మారిన కాలం నుంచి రాజీ పడాల్సి వస్తోందంటున్నారు. గతంలో మాదిరి నిర్మోహమాటంగా వ్యవహరించటం లేదంటున్నారు. ఇప్పుడామెకు కొత్త కష్టం వచ్చినట్లుగా జోరైన ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల్ని వేస్తున్నట్లుగా ఫిర్యాదు రావట.. హైకోర్టు రియాక్టు కావటం తెలిసిందే.

అయినప్పటికీ తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కారుకు ఇటీవల హైకోర్టు మొట్టికాయ వేయటమే కాదు.. రంగులు మార్చని పక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు.. అధికారులపై చర్యలు తప్పవన్న ఘాటుగా రియాక్టు అయ్యింది ఏపీ హైకోర్టు. అంతేకాదు.. ఈ నెల 28న కోర్టుకు స్వయంగా వచ్చి.. ఈ వ్యవహారంపై అప్డేట్ ఇవ్వాలని చెప్పారు.

దీంతో..ఏపీ సీఎస్ నీలం సాహ్ని స్పందించారు. ఆదివారం సెలవును క్యాన్సిల్ చేసి.. ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసిన వివాదంతో పాటు.. హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కోర్టు ఆదేశాల్ని అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద ఇబ్బందులు తప్పవన్న విషయం మీద క్లారిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి.. ఇటు కోర్టుకు మధ్య నలిగిపోకుండా నిర్ణయాలు ఉంటే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి.

This post was last modified on May 25, 2020 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

41 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

55 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago