Political News

వరంగల్ కేసు మిస్టరీ వీడింది

వరంగల్‌ నగర శివార్లలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది ఒకేసారి పాడుబడ్డ బావిలో శవాలుగా తేలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ముందు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ విచారణలో ఇవన్నీ హత్యలని తేలింది.

ఈ హత్యలకు సూత్రధారి ఎవరో.. వాళ్లందరూ ఎలా చంపబడ్డారో పోలీసులు కనిపెట్టారు. మూడు రోజుల పాటు పది పోలీసు బృందాలు నిర్విరామంగా పని చేసి హత్యల వెనుక మిస్టరీని ఛేదించారు. బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కనిపెట్టారు. అతను నేరాన్ని పోలీసుల వద్ద అంగీకరించాడు కూడా.

బాధితులకు నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి.. వాళ్లంతా స్పృహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని బావిలో వేసి వారి ప్రాణాలు తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధిత కుటుంబ పెద్ద అయిన మక్సూద్ కూతురు బుస్రాతో ఉన్న వివాహేతర సంబంధమే సంజయ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణమని వెల్లడైంది.

స్రాకు ఇప్పటికే పెళ్లవగా.. భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరి కుటుంబమంతా గొర్రెకుంటలోని ఓ గోనె సంచుల గోదాంలో పని చేస్తున్నారు. మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల కిందటే బీహార్ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడింది. సంజయ్‌తో వివాహేతర సంబంధం విషయంలో బుస్రాకు.. ఆమె తల్లికి మధ్య గొడవ నడిచింది. ఇటీవల వీరి ఇంటి పైన ఉండే శ్యాం, శ్రీరాం అనే ఇద్దరు కుర్రాళ్లు వీరి కుటుంబ గొడవల్లో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ అందరి మీదా పగ పెంచుకున్నాడు.

బుధవారం రాత్రి మక్సూద్ ఇంట్లో చిన్న పార్టీ లాంటిది జరిగింది. అందరూ బిరియానీలు తిన్నారు. కూల్ డ్రింక్స్ తాగారు. సంజయ్ కుమార్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా అతను కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపాడు. అవి తాగి అందరూ స్పృహ తప్పిపోగా.. కాళ్లు చేతులు కట్టేసి.. ఒక్కక్కరినీ తీసుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేశాడు. వాళ్లంతా నీళ్లు తాగి ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ కుమార్‌కు మరో వ్యక్తి సాయపడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

This post was last modified on May 25, 2020 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్దికి ఫ్రీ పబ్లిసిటీ

తెలుగులో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు.. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా.. పెద్ది. సంక్రాంతి తర్వాత వెలవెలబోతున్న టాలీవుడ్…

5 minutes ago

ఎన్టీఆర్ నీల్… పెద్ద బరువుని మోయాలి

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్…

46 minutes ago

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…

5 hours ago

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

6 hours ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

6 hours ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

6 hours ago