Political News

వరంగల్ కేసు మిస్టరీ వీడింది

వరంగల్‌ నగర శివార్లలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది ఒకేసారి పాడుబడ్డ బావిలో శవాలుగా తేలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ముందు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ విచారణలో ఇవన్నీ హత్యలని తేలింది.

ఈ హత్యలకు సూత్రధారి ఎవరో.. వాళ్లందరూ ఎలా చంపబడ్డారో పోలీసులు కనిపెట్టారు. మూడు రోజుల పాటు పది పోలీసు బృందాలు నిర్విరామంగా పని చేసి హత్యల వెనుక మిస్టరీని ఛేదించారు. బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కనిపెట్టారు. అతను నేరాన్ని పోలీసుల వద్ద అంగీకరించాడు కూడా.

బాధితులకు నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి.. వాళ్లంతా స్పృహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని బావిలో వేసి వారి ప్రాణాలు తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధిత కుటుంబ పెద్ద అయిన మక్సూద్ కూతురు బుస్రాతో ఉన్న వివాహేతర సంబంధమే సంజయ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణమని వెల్లడైంది.

స్రాకు ఇప్పటికే పెళ్లవగా.. భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరి కుటుంబమంతా గొర్రెకుంటలోని ఓ గోనె సంచుల గోదాంలో పని చేస్తున్నారు. మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల కిందటే బీహార్ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడింది. సంజయ్‌తో వివాహేతర సంబంధం విషయంలో బుస్రాకు.. ఆమె తల్లికి మధ్య గొడవ నడిచింది. ఇటీవల వీరి ఇంటి పైన ఉండే శ్యాం, శ్రీరాం అనే ఇద్దరు కుర్రాళ్లు వీరి కుటుంబ గొడవల్లో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ అందరి మీదా పగ పెంచుకున్నాడు.

బుధవారం రాత్రి మక్సూద్ ఇంట్లో చిన్న పార్టీ లాంటిది జరిగింది. అందరూ బిరియానీలు తిన్నారు. కూల్ డ్రింక్స్ తాగారు. సంజయ్ కుమార్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా అతను కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపాడు. అవి తాగి అందరూ స్పృహ తప్పిపోగా.. కాళ్లు చేతులు కట్టేసి.. ఒక్కక్కరినీ తీసుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేశాడు. వాళ్లంతా నీళ్లు తాగి ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ కుమార్‌కు మరో వ్యక్తి సాయపడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

This post was last modified on May 25, 2020 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

47 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago