Political News

ఆయన ఏపీలో వైసీపీ ఎంపీ.. ఢిల్లీలో బీజేపీ ఎంపీనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాస్త భిన్నమైన వ్యక్తిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుగా చెబుతారు. మిగిలిన వారి రూట్ కు భిన్నమైన బాటలో ఆయన పయనిస్తుంటారు. ప్రధాని మోడీ సైతం ఆయన్ను పేరు పెట్టి పిలిచేంత దగ్గరతనం ఆయన సొంతం. అంతేనా.. మోడీషాల అపాయింట్ మెంట్ కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కంటే ముందే ఈ ఎంపీకి ఇస్తారన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది.

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా.. ఢిల్లీలో బీజేపీ ఎంపీగా ఆయన్ను అభివర్ణిస్తారు. అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తుంటారు. తాను ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అని చెప్పుకుంటూనే.. ఢిల్లీలో మాత్రం ఎంపీగా తనను గుర్తిస్తారని చెబుతారు. కాకుంటే.. బీజేపీ ఎంపీ అన్న ముద్రను మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ ఆయనకు అలాంటి పేరు ఎందుకు వచ్చిందన్న మాటకు ఆయన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో బీజేపీ ఎంపీలంతా ఒక చోట కూర్చుంటారని.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలంతా మరో చోట కూర్చుంటామని.. అలాంటప్పుడు ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. బీజేపీతో సన్నిహితంగా లేకుండా.. సీపీఐ,సీపీఎంతో కలిసి ఉండలేం కదా?అని ప్రశ్నిస్తారు. పార్టీ మెచ్చుకునే స్థాయిలో లేకున్నా.. నొచ్చుకునే మాదిరి మాత్రం తాను వ్యవహరించనని చెప్పారు. ఈ రోజున రాష్ట్రానికి ఏదైనా పని చేయించుకోవాలంటే బీజేపీ నేతల సహకారం అవసరమని.. అలాంటప్పుడు వారితో కలవటం తప్పు కాదు కదా? అన్నది ఆయన వాదన.

మోడీషాల అపాయింట్ మెంట్ ముఖ్యమంత్రి జగన్ కంటే కూడా రఘురామ కృష్ణంరాజుకే ముందుగా ఇస్తారన్న మాటకు ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చే పలు పథకాలకు సంబంధించి మార్పులు.. చేర్పులు చేయాల్సి వస్తే వారి వద్దకు వెళ్లి వివరిస్తానని.. ఆ అలవాటుతో వారితో మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో తాను చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. మొత్తానికి జగన్ పార్టీ ఎంపీల్లో మిగిలిన వారికి భిన్నమైన క్యారెక్టర్ రఘురామ కృష్ణంరాజు అనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు.

This post was last modified on May 25, 2020 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago