Political News

ఆయన ఏపీలో వైసీపీ ఎంపీ.. ఢిల్లీలో బీజేపీ ఎంపీనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాస్త భిన్నమైన వ్యక్తిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుగా చెబుతారు. మిగిలిన వారి రూట్ కు భిన్నమైన బాటలో ఆయన పయనిస్తుంటారు. ప్రధాని మోడీ సైతం ఆయన్ను పేరు పెట్టి పిలిచేంత దగ్గరతనం ఆయన సొంతం. అంతేనా.. మోడీషాల అపాయింట్ మెంట్ కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కంటే ముందే ఈ ఎంపీకి ఇస్తారన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది.

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా.. ఢిల్లీలో బీజేపీ ఎంపీగా ఆయన్ను అభివర్ణిస్తారు. అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తుంటారు. తాను ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అని చెప్పుకుంటూనే.. ఢిల్లీలో మాత్రం ఎంపీగా తనను గుర్తిస్తారని చెబుతారు. కాకుంటే.. బీజేపీ ఎంపీ అన్న ముద్రను మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ ఆయనకు అలాంటి పేరు ఎందుకు వచ్చిందన్న మాటకు ఆయన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో బీజేపీ ఎంపీలంతా ఒక చోట కూర్చుంటారని.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలంతా మరో చోట కూర్చుంటామని.. అలాంటప్పుడు ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. బీజేపీతో సన్నిహితంగా లేకుండా.. సీపీఐ,సీపీఎంతో కలిసి ఉండలేం కదా?అని ప్రశ్నిస్తారు. పార్టీ మెచ్చుకునే స్థాయిలో లేకున్నా.. నొచ్చుకునే మాదిరి మాత్రం తాను వ్యవహరించనని చెప్పారు. ఈ రోజున రాష్ట్రానికి ఏదైనా పని చేయించుకోవాలంటే బీజేపీ నేతల సహకారం అవసరమని.. అలాంటప్పుడు వారితో కలవటం తప్పు కాదు కదా? అన్నది ఆయన వాదన.

మోడీషాల అపాయింట్ మెంట్ ముఖ్యమంత్రి జగన్ కంటే కూడా రఘురామ కృష్ణంరాజుకే ముందుగా ఇస్తారన్న మాటకు ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చే పలు పథకాలకు సంబంధించి మార్పులు.. చేర్పులు చేయాల్సి వస్తే వారి వద్దకు వెళ్లి వివరిస్తానని.. ఆ అలవాటుతో వారితో మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో తాను చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. మొత్తానికి జగన్ పార్టీ ఎంపీల్లో మిగిలిన వారికి భిన్నమైన క్యారెక్టర్ రఘురామ కృష్ణంరాజు అనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు.

This post was last modified on May 25, 2020 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

11 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

23 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago