నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చిచ్చు సంచలనంగా మారింది. నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు పాక ఆత్మహత్యకు నిరసనగా నల్గొండలో షర్మిల దీక్ష చేశారు. ఈ దీక్షలో ఉన్న షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఈ విషయమే ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది.
వైఎస్పార్టీపీ అద్యక్షురాలు షర్మిలంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు రేవంత్ వ్యతిరేకిస్తున్న పార్టీని కార్యక్రమాన్ని అదే పార్టీకి చెందిన ఎంఎల్ఏ కోమటిరెడ్డి మద్దతు పలకటమే ఆశ్చర్యంగా ఉంది. మొదటినుండి రేవంత్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే షర్మిల దీక్షకు ఎంఎల్ఏ మద్దతు పలకటం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ లో నుండి అనేకమంది నేతలు వలసలు వెళ్ళిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వైఎస్సార్టీపీ ఆవిర్భావ సమావేశానికి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ విషయం తెలిసినపుడు కూడా పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. షర్మిల పార్టీకి కోమటిరెడ్డి సోదరులిద్దరు మద్దతుగా నిలబడ్డారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీనికి సోదరుల చర్యలు మరింత ఆజ్యం పోస్తున్నట్లుగా తయారైంది.
కాంగ్రెస్ పార్టీలో నుండి నేతలను షర్మిల పార్టీవైపు వెళ్ళకుండా రేవంత్ చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. రెడ్డీ సామాజికవర్గంలో తొందరలోనే చీలిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. షర్మిల పార్టీకి ఉన్న బలమెంత ? అసలు తెలంగాణా జనాలు షర్మిలను ఆదరిస్తారా ? అనే విషయమై ఎవరిలోను క్లారిటి లేదు.
అయినా జనాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు షర్మిల తనవస్తులు తాను పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ లోని సీనియర్లు గనుక మద్దతుగా నిలబడితే షర్మిల పార్టీకి కాస్త జనబలం వచ్చే అవకాశాన్ని కొట్టిపారేసేందకు లేదు. మరి భవిష్యత్తులో కోమటిరెడ్డి సోదరులతో పాటు మరికొందరు సీనియర్ల వైఖరి బయటపడే అవకాశం ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.
This post was last modified on July 28, 2021 11:59 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…