ఐపీఎస్ మాజీ అధికారి, స్వేరో చీఫఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన బీఎస్పీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు.. జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.
ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఆ సయమంలోనే ప్రవీణ్ తో పాటు దాదాపు 5లక్షల మంది బీఎస్పీ తీర్థం పుచ్చుకునేలా ప్లాన్ చేశారట.
నిజానికి కాన్షీరాం అడుగుజాడల్లో నడుస్తానని ప్రవీణ్ కుమార్ ప్రకటించినప్పుడే.. బీఎస్పీ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదించారని వార్తలొచ్చాయి. అంతేకాదు సొంతంగా పార్టీ పెడతారని కూడా అనుకున్నారు. కానీ.. చివరకు బీఎస్పీలో చేరుతున్నట్లు కన్ఫామ్ చేశారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆధిపత్య కులాల నాయకులను గారు అని గౌరవించి.. పీడిత వర్గాలకు చెందినవారిని ఏక వచనంతో పిలిచారని మండిపడ్డారు. ఈ దురహంకార భావజాలం వల్లే ప్రజలు బహుజన రాజ్యం రావాలని అంటున్నారని చెప్పారు.
This post was last modified on July 27, 2021 6:29 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…