ఐపీఎస్ మాజీ అధికారి, స్వేరో చీఫఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన బీఎస్పీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు.. జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.
ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఆ సయమంలోనే ప్రవీణ్ తో పాటు దాదాపు 5లక్షల మంది బీఎస్పీ తీర్థం పుచ్చుకునేలా ప్లాన్ చేశారట.
నిజానికి కాన్షీరాం అడుగుజాడల్లో నడుస్తానని ప్రవీణ్ కుమార్ ప్రకటించినప్పుడే.. బీఎస్పీ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదించారని వార్తలొచ్చాయి. అంతేకాదు సొంతంగా పార్టీ పెడతారని కూడా అనుకున్నారు. కానీ.. చివరకు బీఎస్పీలో చేరుతున్నట్లు కన్ఫామ్ చేశారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆధిపత్య కులాల నాయకులను గారు అని గౌరవించి.. పీడిత వర్గాలకు చెందినవారిని ఏక వచనంతో పిలిచారని మండిపడ్డారు. ఈ దురహంకార భావజాలం వల్లే ప్రజలు బహుజన రాజ్యం రావాలని అంటున్నారని చెప్పారు.
This post was last modified on July 27, 2021 6:29 pm
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…
స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా…