ఐపీఎస్ మాజీ అధికారి, స్వేరో చీఫఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన బీఎస్పీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు.. జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.
ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఆ సయమంలోనే ప్రవీణ్ తో పాటు దాదాపు 5లక్షల మంది బీఎస్పీ తీర్థం పుచ్చుకునేలా ప్లాన్ చేశారట.
నిజానికి కాన్షీరాం అడుగుజాడల్లో నడుస్తానని ప్రవీణ్ కుమార్ ప్రకటించినప్పుడే.. బీఎస్పీ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదించారని వార్తలొచ్చాయి. అంతేకాదు సొంతంగా పార్టీ పెడతారని కూడా అనుకున్నారు. కానీ.. చివరకు బీఎస్పీలో చేరుతున్నట్లు కన్ఫామ్ చేశారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆధిపత్య కులాల నాయకులను గారు అని గౌరవించి.. పీడిత వర్గాలకు చెందినవారిని ఏక వచనంతో పిలిచారని మండిపడ్డారు. ఈ దురహంకార భావజాలం వల్లే ప్రజలు బహుజన రాజ్యం రావాలని అంటున్నారని చెప్పారు.
This post was last modified on July 27, 2021 6:29 pm
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…