తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో పీక్స్కు చేరాయి. తాజాగా మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో ఇంకా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అయితే, ఈటల రాజీనామా, తదనంతర పరిణామాలు ఇందులో హైలెట్. ఈ పరిణామాల్లో బీజేపీలో సమీకరణాలు మారుతున్నాయంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఎపిసోడ్లో తాజాగా సంచలనంగా మారాయి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం బీజేపీలో చేరడాన్ని పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉపఎన్నికల అనివార్యం అయ్యాయి. అయితే, ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు బీజేపీని వీడటం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పంపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా ఈటలను చేర్చుకుని తప్పు చేశారంటూ ప్రకటించారు. ఈటల రాజేందర్ అంశంలోనే పార్టీపై ఆరోపణలు చేశారు.
బీజేపీ నేతలు పలువురు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు బీజేపీ నేతల్లో ఆందోళనకు కారణంగా మారాయి. అయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకాన్ని తప్పు పట్టిన కొంతమంది ఇలాంటి పరిణామాలను సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను వ్యతిరేకిస్తున్న నేతలు వలసలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈటల సాకుతో సంజయ్ దూకుడు బ్రేక్ వేసేందుకు వ్యూహం పన్నుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ బండి సంజయ్ కు ఒకింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
This post was last modified on July 27, 2021 6:25 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…