Political News

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ పై కాంగ్రెస్ వ‌ల ఫ‌లిస్తుందా?

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుపెన్న‌డూ లేని రీతిలో గ‌త కొద్దికాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

అయితే, ఆయ‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలోనే తెల‌గాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌వీణ్ కుమార్‌కు వ‌ల వేస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఓపెన్ హార్ట్‌తో స్వాగతిస్తామని కాంగ్రెస్ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేసింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్, మహేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉపఎన్నిక, ఉద్యోగాల భర్తీ కోసం 48 గంటల దీక్ష తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. దళిత సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆర్‌ను ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.
నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించిందని కాంగ్రెస్ నేత‌లు వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే గురుకులాలకు కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన పార్టీలోకి వస్తానంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.

దళిత సీఎం, మూడెకరాల భూమి విషయంలో కేసీఆర్ మోసంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ నిలదీయాలని కాంగ్రెస్ నేత‌లు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేసే నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, హెచ్‌ఆర్సీ, హైకోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు.

పేదలకిచ్చిన అసైన్డ్ భూమిపై కుటుంబాలు తరతరాలు ఆధారపడి జీవిస్తాయని, కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూముల విలువ పెరిగిందన్నారు. ఆ భూములను కేసీఆర్ పేదల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, తమ గోడును చెప్పుకోవడానికి వెళితే కలెక్టర్లను కలువడం లేదని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో మ‌రి!

This post was last modified on July 26, 2021 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

11 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

17 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

48 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago