మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుపెన్నడూ లేని రీతిలో గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పలు సంచలన ప్రకటనలు చేస్తున్నారు.
అయితే, ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే తెలగాణలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ కుమార్కు వల వేస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్లోకి వస్తామంటే ఓపెన్ హార్ట్తో స్వాగతిస్తామని కాంగ్రెస్ బహిరంగ ప్రకటన చేసింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్, మహేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉపఎన్నిక, ఉద్యోగాల భర్తీ కోసం 48 గంటల దీక్ష తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. దళిత సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆర్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గురుకులాల కార్యదర్శిగా నియమించిందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే గురుకులాలకు కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన పార్టీలోకి వస్తానంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
దళిత సీఎం, మూడెకరాల భూమి విషయంలో కేసీఆర్ మోసంపై ఆర్ఎస్ ప్రవీణ్ నిలదీయాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేసే నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, హెచ్ఆర్సీ, హైకోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు.
పేదలకిచ్చిన అసైన్డ్ భూమిపై కుటుంబాలు తరతరాలు ఆధారపడి జీవిస్తాయని, కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూముల విలువ పెరిగిందన్నారు. ఆ భూములను కేసీఆర్ పేదల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, తమ గోడును చెప్పుకోవడానికి వెళితే కలెక్టర్లను కలువడం లేదని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ ప్రతిపాదనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో మరి!
This post was last modified on July 26, 2021 11:54 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…