Political News

క‌ళ్యాణ‌దుర్గం లో తిరిగి పట్టు సాధిస్తున్న టీడీపీ

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఇక్క‌డ టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. 2014లో విజ‌యం ద‌క్కించుకున్న ఉన్నం హ‌నుమంత‌రాయ చౌద‌రిని ప‌క్క‌న పెట్టి గ‌త 2019 ఎన్నిక‌ల్లో మాదినేని ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడుకు చంద్ర‌బాబు అవ‌కాశం ఇచ్చారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ ట‌ఫ్‌గా ఉండ‌డం వైసీపీ దూకుడు, జ‌గ‌న్ హ‌వా నేప‌థ్యంలో ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. అయితే.. గ‌డిచిన రెండేళ్ల‌లో.. ఇక్క‌డ టీడీపీ రాజ‌కీయం కీల‌క మ‌లుపు తిరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన‌.. ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు.. క‌నిపించ‌క‌పోగా.. ఆయ‌న ఊసు కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

దీంతో మ‌ళ్లీ ఉన్నం పుంజుకున్నారు. అంతేకాదు.. ఈ ద‌ఫా.. ఆయ‌న త‌న ఇద్ద‌రు త‌న‌యుల‌ను కూడా టీడీపీలో చేర్పించి.. రాజ‌కీయంగా యూత్‌ను త‌న‌ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉన్నం తనయులు మారుతి చౌదరి, ఉదయ్‌చౌదరిలు.. కూడా యూత్ ఫాలోయింగ్‌లో ముందున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలా వుంటే.. స్థానికంగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌.. వైఖ‌రితో టీడీపీ మ‌రింత పుంజుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. ఆమె.. బెంగ‌ళూరుకే ప‌రిమితం కావ‌డం.. కేవ‌లం స‌భ‌లు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌డం పెద్ద ఎత్తున ఆమెపై వ్య‌తిరేక‌త పెరిగేలా చేసింది. దీనికితోడు.. స్థానిక‌ ఎంపీతో ఆమెకు ఉన్న వివాదాలతో నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఇదే అదునుగా.. ఉన్నం పుంజుకున్నారు. గ‌త అనుభ‌వాలు, పార్టీలో సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని ఆయ‌న రాజ‌కీయాలు సాగించేందుకు.. ఉత్సాహంగా క‌దులుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న త‌న జ‌న్మ‌దిన వేడుక నిర్వ‌హించారు. అయితే.. పైకి పుట్టిన రోజు ఫంక్ష‌నే అయిన‌ప్ప‌టికీ.. త‌న రాజ‌కీయ బ‌లాన్ని నిరూపించే వ్యూహాన్ని ఉన్నం అమ‌లు చేశారనే టాక్ వినిపించింది. ఈ కార్య‌క్ర‌మానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అంతేకాదు.. 30 మంది వ‌ర‌కు వైసీపీ నుంచి వ‌చ్చి.. పార్టీలో చేర‌డం.. ఉన్నం కుమారుల‌కు జై కొట్ట‌డం.. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

దీనికి టీడీపీ పై ఉన్న సానుభూతితో పాటు.. స్థానికంగా ఎమ్మెల్యే నిర్ల‌క్ష్యం.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం వంటి ప‌రిణా మాలు కార‌ణంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ఇలానే ఉంటే.. ఖ‌చ్చితంగా టీడీపీ భారీ మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు పరిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల కాలంలో మారుతున్న ప‌రిణామాలు కూడా టీడీపీకి ప్ల‌స్‌గా మారుతున్నాయ‌ని.. ఉన్నం కుమారులు స‌హా హ‌నుమంత‌రాయ చౌద‌రి దూకుడు వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ప‌రిశీల‌కులు సైతం అంటున్నారు. మ‌రి నిజంగానే మార్పు వ‌స్తుందో.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందో.. లేదో.. చూడాలి.

Satya

Recent Posts

హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…

14 minutes ago

హ్యాపీ దెబ్బకు ఆర్య బయటికి వస్తున్నాడు

మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…

20 minutes ago

నీట్ రీ ఎగ్జామ్… ఆ యాప్ బ్యాన్!

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…

51 minutes ago

చికిరిని చూసే కోణం మారిపోయింది

గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…

1 hour ago

కల్కి 2 కోసం ఆర్ఆర్ఆర్ సీత ?

ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…

2 hours ago

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

5 hours ago