రాయలసీమ ప్రాజెక్టులపై సీనియర్ నేత మైసూరారెడ్డిని వైసీపీ ఎంఎల్ఏ, కొడుకు వరసయ్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఇపుడు రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న మైసూరా 2014-19 మధ్యలో ఎందుకు నోరిప్పలేదని తగులుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం ఉన్నపుడే తెలంగాణా ప్రభుత్వం జలదోపిడి చేసిన విషయం మైసూరాకు తెలీదా అంటు ప్రశ్నించారు.
కేసీయార్ దోపిడీని చంద్రబాబునాయుడు ఆపడంలో ఫెయిల్ అయినపుడు మైసూరా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పట్లో తెలంగాణా జలదోపిడిని అడ్డుకోలేకపోయారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని జగన్ ప్రయత్నిస్తున్న విషయం తెలియదా అంటు మైసూరాను డాక్టర్ సూటిగా ప్రశ్నించారు.
ఏపికి అన్యాయం చేస్తున్నది కేసీయార్ అయితే మైసూరా జగన్ను ప్రశ్నించటంలో అర్ధమేలేదన్నారు. ఏపికి తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా అంగీకరించిన విషయం మైసూరాకు తెలీదా అని డాక్టర్ మండిపడ్డారు. కేటాయించిన నీటికన్నా తెలంగాణా ప్రభుత్వం ఎక్కువ వాడేసుకుంటోందని, అక్రమంగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి పార్లమెంటులోనే అంగీకరించిన విషయాన్ని మైసూరా గమనించాలన్నారు.
ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలన్న విషయం సీఎంలిద్దరికీ తెలీదా అంటూ డాక్టర్ మైసూరాను ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్రభుత్వం చర్చలకు కలసి రానికారణంగానే జగన్ కేంద్ర సంస్ధలకు, కేంద్రానికి లేఖలు రాయాల్సొచ్చిందని మైసూరాకు తెలీదా అని ప్రశ్నించారు. ఇంతకీ డాక్టర్ సుదీర్ రెడ్డి మాజీమంత్రి మైసూరాకు కొడుకు వరసవుతారు. మైసూరా తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొడుకే జమ్మలమడుగు ఎంఎల్ఏ డాక్టర్ సుధీర్ రెడ్డి. మొత్తానికి మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్ పడింది.
This post was last modified on July 23, 2021 12:22 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…