Political News

మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్

రాయలసీమ ప్రాజెక్టులపై సీనియర్ నేత మైసూరారెడ్డిని వైసీపీ ఎంఎల్ఏ, కొడుకు వరసయ్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఇపుడు రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న మైసూరా 2014-19 మధ్యలో ఎందుకు నోరిప్పలేదని తగులుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం ఉన్నపుడే తెలంగాణా ప్రభుత్వం జలదోపిడి చేసిన విషయం మైసూరాకు తెలీదా అంటు ప్రశ్నించారు.

కేసీయార్ దోపిడీని చంద్రబాబునాయుడు ఆపడంలో ఫెయిల్ అయినపుడు మైసూరా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పట్లో తెలంగాణా జలదోపిడిని అడ్డుకోలేకపోయారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని జగన్ ప్రయత్నిస్తున్న విషయం తెలియదా అంటు మైసూరాను డాక్టర్ సూటిగా ప్రశ్నించారు.

ఏపికి అన్యాయం చేస్తున్నది కేసీయార్ అయితే మైసూరా జగన్ను ప్రశ్నించటంలో అర్ధమేలేదన్నారు. ఏపికి తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా అంగీకరించిన విషయం మైసూరాకు తెలీదా అని డాక్టర్ మండిపడ్డారు. కేటాయించిన నీటికన్నా తెలంగాణా ప్రభుత్వం ఎక్కువ వాడేసుకుంటోందని, అక్రమంగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి పార్లమెంటులోనే అంగీకరించిన విషయాన్ని మైసూరా గమనించాలన్నారు.

ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలన్న విషయం సీఎంలిద్దరికీ తెలీదా అంటూ డాక్టర్ మైసూరాను ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్రభుత్వం చర్చలకు కలసి రానికారణంగానే జగన్ కేంద్ర సంస్ధలకు, కేంద్రానికి లేఖలు రాయాల్సొచ్చిందని మైసూరాకు తెలీదా అని ప్రశ్నించారు. ఇంతకీ డాక్టర్ సుదీర్ రెడ్డి మాజీమంత్రి మైసూరాకు కొడుకు వరసవుతారు. మైసూరా తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొడుకే జమ్మలమడుగు ఎంఎల్ఏ డాక్టర్ సుధీర్ రెడ్డి. మొత్తానికి మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్ పడింది.

This post was last modified on July 23, 2021 12:22 pm

Share
Show comments

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

3 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

6 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

7 hours ago