Political News

మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్

రాయలసీమ ప్రాజెక్టులపై సీనియర్ నేత మైసూరారెడ్డిని వైసీపీ ఎంఎల్ఏ, కొడుకు వరసయ్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఇపుడు రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న మైసూరా 2014-19 మధ్యలో ఎందుకు నోరిప్పలేదని తగులుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం ఉన్నపుడే తెలంగాణా ప్రభుత్వం జలదోపిడి చేసిన విషయం మైసూరాకు తెలీదా అంటు ప్రశ్నించారు.

కేసీయార్ దోపిడీని చంద్రబాబునాయుడు ఆపడంలో ఫెయిల్ అయినపుడు మైసూరా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పట్లో తెలంగాణా జలదోపిడిని అడ్డుకోలేకపోయారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని జగన్ ప్రయత్నిస్తున్న విషయం తెలియదా అంటు మైసూరాను డాక్టర్ సూటిగా ప్రశ్నించారు.

ఏపికి అన్యాయం చేస్తున్నది కేసీయార్ అయితే మైసూరా జగన్ను ప్రశ్నించటంలో అర్ధమేలేదన్నారు. ఏపికి తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా అంగీకరించిన విషయం మైసూరాకు తెలీదా అని డాక్టర్ మండిపడ్డారు. కేటాయించిన నీటికన్నా తెలంగాణా ప్రభుత్వం ఎక్కువ వాడేసుకుంటోందని, అక్రమంగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి పార్లమెంటులోనే అంగీకరించిన విషయాన్ని మైసూరా గమనించాలన్నారు.

ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలన్న విషయం సీఎంలిద్దరికీ తెలీదా అంటూ డాక్టర్ మైసూరాను ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్రభుత్వం చర్చలకు కలసి రానికారణంగానే జగన్ కేంద్ర సంస్ధలకు, కేంద్రానికి లేఖలు రాయాల్సొచ్చిందని మైసూరాకు తెలీదా అని ప్రశ్నించారు. ఇంతకీ డాక్టర్ సుదీర్ రెడ్డి మాజీమంత్రి మైసూరాకు కొడుకు వరసవుతారు. మైసూరా తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొడుకే జమ్మలమడుగు ఎంఎల్ఏ డాక్టర్ సుధీర్ రెడ్డి. మొత్తానికి మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్ పడింది.

This post was last modified on July 23, 2021 12:22 pm

Share
Show comments

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago