తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఎన్నికలను ఉద్దేశించి..బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు.
తమ డిమాండ్స్ పూర్తి చేయకుంటే.. హుజురాబాద్ లో వెయ్యి మంది అభ్యర్థులను పోటీకి దింపుతానని హెచ్చరించారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్ల కోసం కృష్ణయ్య దీక్ష చేపట్టారు. తొలగించిన 7వేల 600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటేనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో వెయ్యి మందితో పోటీ చేస్తామన్నారు. పది వేల మందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా ఉండేవారు. అయితే గతేడాది ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్నామని.. తమను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని అప్పట్లో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేపట్టారు. ఈ కారణంగా ప్రభుత్వం వారిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.
This post was last modified on July 21, 2021 9:47 pm
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…