Political News

‘హుజురాబాద్ లో వెయ్యిమంది పోటీ’..!

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఎన్నికలను ఉద్దేశించి..బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

తమ డిమాండ్స్ పూర్తి చేయకుంటే.. హుజురాబాద్ లో వెయ్యి మంది అభ్యర్థులను పోటీకి దింపుతానని హెచ్చరించారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్ల కోసం కృష్ణయ్య దీక్ష చేపట్టారు. తొలగించిన 7వేల 600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటేనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో వెయ్యి మందితో పోటీ చేస్తామన్నారు. పది వేల మందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా ఉండేవారు. అయితే గతేడాది ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్నామని.. తమను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని అప్పట్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మె చేపట్టారు. ఈ కారణంగా ప్రభుత్వం వారిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.

This post was last modified on July 21, 2021 9:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

1 hour ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

5 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

5 hours ago