Political News

పార్ల‌మెంటులో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఆధిప‌త్య పోరేనా?

పార్ల‌మెంటు వేదిక‌గా.. ఏపీ అధికార, విప‌క్ష పార్టీలు చేస్తున్న రాజ‌కీయం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. వంటి అనేక అంశాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సిందే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి రెండో మాట లేదు. రాష్ట్రం విడిపోయి.. 8 ఏళ్లు అవుతున్నా.. కేంద్రం ఇప్ప‌టికీ విభ‌జ‌న చ‌ట్టంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు దృష్టి పెట్ట‌లేదు. పైగా.. అస‌లు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. కొలిక్కిరాలేదు. దీంతో వీటిని సాధించుకునేందుకు వైసీపీ, టీడీపీలు పెద్ద ఎత్తున ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించాయి.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇరు పార్టీల ఎంపీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించాయి. అయితే.. ఇక్క‌డ రెండు పార్టీలూ కూడా.. ఎవ‌రి అజెండా వారు ఎంచుకోవ‌డం.. వైసీపీపై పైచేయి సాధించాల‌ని టీడీపీ, టీడీపీపై పై చేయి సాధించాల‌ని వైసీపీలు వ్య‌వ‌హ‌రించ‌డం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. నిజానికి రెండు పార్టీల‌కు చిత్త‌శుద్ధి ఉంటే.. ఒకే స‌మ‌స్య‌పై రెండు పార్టీలు వేర్వేరు నోటీసులు కాకుండా.. ఒకే నోటీసు ఇచ్చి ఉంటే.. మ‌రింత బ‌లంగా పార్ల‌మెంటులో వాద‌న‌లు వినిపించేందుకు అవ‌కాశం ఉండేది.

కానీ, వైసీపీ, టీడీపీలు వేర్వేరుగా నోటీసులు ఇవ్వ‌డం.. హోదా మీరు తీసుకురాలేద‌ని.. కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌ని.. వైసీపీ నేతలు.. కాదు.. మీరే అడ్డు ప‌డ్డార‌ని, రెండేళ్లు పాల‌న గ‌డిచిపోయినా.. ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదని టీడీపీ.. పార్ల‌మెంటు లాబీల్లో విమ‌ర్శించుకోవ‌డం.. స‌భ‌లో ఏక‌ప‌క్షంగా ఎవ‌రికి వారే వ్యూహాలు వేసుకుని.. ముందుకు సాగ‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం.. ఉంటుంది? అనేది కీల‌కంగా మారింది. తొలిరోజు.. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి.. రాజ్య‌స‌భ‌లో చేసిన హంగామా చూసిన‌.. తృణ‌మూల్ ఎంపీ ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. “వారికి ఏం కావాలో క్లారిటీ లేదు. లోక‌ల్‌గా చేయాల్సిన పోరును పార్ల‌మెంటులో చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

అంటే, దీనిని బ‌ట్టి.. వైసీపీ, టీడీపీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఎలా న‌వ్వుల పాల‌వుతోందో.. అర్ధ‌మ‌వుతుంది. నిజానికి వైసీపీకి వేరే టార్గెట్లు ఉన్నాయి. కేంద్రం రాష్ట్రానికి అప్పులు పుట్టే విష‌యంలో అడ్డుప‌డుతోంది. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం అంచ‌నాల‌ను ఆమోదించ‌డం లేదు. ఇక‌, దిశ చ‌ట్టాన్ని కూడా ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌మంటే.. పూర్తిగా త‌న చేతుల్లోకి తీసుకోవ‌డం.. వంటివాటిపై పోరాడాల్సి ఉంది. అయితే.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ వైఫ‌ల్యాల కార‌ణంగా కొని తెచ్చుకున్న స‌మ‌స్య‌లే కావ‌డంతో ముందుగా.. హోదాపై గ‌ళం విప్పి.. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే వ్యూహంతోనే వైసీపీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 21, 2021 11:08 am

Share
Show comments

Recent Posts

నిజమా… విజయ్ కోసమే త్రిష తిరుమలకు?

తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…

14 seconds ago

క్రియేటివిటీ ప్రోమోల‌కే ప‌రిమిత‌మా?

గ‌త శుక్ర‌వారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది క‌మెడియ‌న్ స‌త్య హీరోగా ప‌రిచయం అయిన సినిమా. అయినా స‌రే..…

1 hour ago

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

4 hours ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

5 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

9 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

10 hours ago