Political News

పార్ల‌మెంటులో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఆధిప‌త్య పోరేనా?

పార్ల‌మెంటు వేదిక‌గా.. ఏపీ అధికార, విప‌క్ష పార్టీలు చేస్తున్న రాజ‌కీయం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. వంటి అనేక అంశాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సిందే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి రెండో మాట లేదు. రాష్ట్రం విడిపోయి.. 8 ఏళ్లు అవుతున్నా.. కేంద్రం ఇప్ప‌టికీ విభ‌జ‌న చ‌ట్టంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు దృష్టి పెట్ట‌లేదు. పైగా.. అస‌లు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. కొలిక్కిరాలేదు. దీంతో వీటిని సాధించుకునేందుకు వైసీపీ, టీడీపీలు పెద్ద ఎత్తున ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించాయి.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇరు పార్టీల ఎంపీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించాయి. అయితే.. ఇక్క‌డ రెండు పార్టీలూ కూడా.. ఎవ‌రి అజెండా వారు ఎంచుకోవ‌డం.. వైసీపీపై పైచేయి సాధించాల‌ని టీడీపీ, టీడీపీపై పై చేయి సాధించాల‌ని వైసీపీలు వ్య‌వ‌హ‌రించ‌డం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. నిజానికి రెండు పార్టీల‌కు చిత్త‌శుద్ధి ఉంటే.. ఒకే స‌మ‌స్య‌పై రెండు పార్టీలు వేర్వేరు నోటీసులు కాకుండా.. ఒకే నోటీసు ఇచ్చి ఉంటే.. మ‌రింత బ‌లంగా పార్ల‌మెంటులో వాద‌న‌లు వినిపించేందుకు అవ‌కాశం ఉండేది.

కానీ, వైసీపీ, టీడీపీలు వేర్వేరుగా నోటీసులు ఇవ్వ‌డం.. హోదా మీరు తీసుకురాలేద‌ని.. కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌ని.. వైసీపీ నేతలు.. కాదు.. మీరే అడ్డు ప‌డ్డార‌ని, రెండేళ్లు పాల‌న గ‌డిచిపోయినా.. ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదని టీడీపీ.. పార్ల‌మెంటు లాబీల్లో విమ‌ర్శించుకోవ‌డం.. స‌భ‌లో ఏక‌ప‌క్షంగా ఎవ‌రికి వారే వ్యూహాలు వేసుకుని.. ముందుకు సాగ‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం.. ఉంటుంది? అనేది కీల‌కంగా మారింది. తొలిరోజు.. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి.. రాజ్య‌స‌భ‌లో చేసిన హంగామా చూసిన‌.. తృణ‌మూల్ ఎంపీ ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. “వారికి ఏం కావాలో క్లారిటీ లేదు. లోక‌ల్‌గా చేయాల్సిన పోరును పార్ల‌మెంటులో చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

అంటే, దీనిని బ‌ట్టి.. వైసీపీ, టీడీపీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఎలా న‌వ్వుల పాల‌వుతోందో.. అర్ధ‌మ‌వుతుంది. నిజానికి వైసీపీకి వేరే టార్గెట్లు ఉన్నాయి. కేంద్రం రాష్ట్రానికి అప్పులు పుట్టే విష‌యంలో అడ్డుప‌డుతోంది. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం అంచ‌నాల‌ను ఆమోదించ‌డం లేదు. ఇక‌, దిశ చ‌ట్టాన్ని కూడా ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌మంటే.. పూర్తిగా త‌న చేతుల్లోకి తీసుకోవ‌డం.. వంటివాటిపై పోరాడాల్సి ఉంది. అయితే.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ వైఫ‌ల్యాల కార‌ణంగా కొని తెచ్చుకున్న స‌మ‌స్య‌లే కావ‌డంతో ముందుగా.. హోదాపై గ‌ళం విప్పి.. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే వ్యూహంతోనే వైసీపీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 21, 2021 11:08 am

Share
Show comments

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago