సింగరేణి కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్.. వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇంత సడెన్ గా.. సీఎం వాళ్లపై వరాల జల్లు కురిపించడానికి కారణం త్వరలో రానున్న ఎన్నికలేనా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణతో పాటు దక్షిణ భారత దేశానికి వెలుగులు నింపుతున్న సింగరేణిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతో కాలంగా వాయిదా పడ్డ సింగరేణి ఎన్నికలు త్వరలో జరగనుండటంతో.. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది.
గతంలో కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక హామీలిచ్చారు. కానీ వాటి అమలు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. దీంతో..తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే సింగరేణి కార్మికులు అసంతృప్తితోనే ఉన్నారు. అంతేకాదు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని టీఆర్ఎస్ కు అనుబంధంగా మొదలుపెట్టి… అధికారిక సంఘంగా గుర్తింపు పొందటంలో శ్రమించిన కెంగర్ల మల్లయ్య ఆ మధ్య సంఘానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ఎన్నికలొచ్చే సమయానికి ఆయన్ను తిరిగి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
అంతేకాక.. ఎన్నికల్లో భాగంగానే.. కేసీఆర్ ఇప్పుడు రిటైర్మెంట్ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు సింగరేణి కోసం మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
This post was last modified on July 21, 2021 10:53 am
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…