తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బక్కని నరసింహులును పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లోనూ టీడీపీని పరుగు లు పెట్టించే లక్ష్యంతో ఇరు రాష్ట్రాలకూ అధ్యక్షులను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2014లో టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణను ఎంపిక చేసి పగ్గాలు అప్పగించారు. ఈయన హయాంలో రెండు కీలక ఎన్నికలు వచ్చాయి. అయితే.. పార్టీ పుంజుకున్న పరిస్థితి కనిపించలేదు. ఈలోగా టీఆర్ ఎస్ నుంచి ఆహ్వానం రావడంతో రమణ.. ఇటీవల గులాబీ దళంలో చేరిపోయారు.
ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు కీలక నేతలు.. చాలా మంది ముందుకు వచ్చారు. రావుల చంద్రశేఖరెడ్డి వంటి కీలక నేతలు ఈ క్యూలో ఉన్నారు. అయితే.. వీరందరినీ కాదని.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బక్కని నరసింహులుకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు.
మరి బాబు వ్యూహం ఏంటి? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వంటి కీలకమైన సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీలు పగ్గాలు అప్పగిస్తుంటే.. వారందరినీ కాదని.. ఎస్సీ వర్గానికి చెందిన నరసింహులును ఎందుకు ఎంపిక చేశారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం టీడీపీని బలోపేతం చేసేందుకు కీలక వ్యూహాలతో ముందుకు నడవాల్సిన నాయకుల అవసరం చాలా ఉంది.
కానీ, కేవలం 1994-99 మధ్య షాద్ నగర్ నుంచి ఒక్కసారి మాత్రమే విజయం దక్కించుకున్న బక్కని వల్ల.. పార్టీలో కేడర్ను నడిపించడం సాధ్యమేనా? అన్నది కీలక ప్రశ్న. పైగా అగ్రవర్ణ ఆధిపత్య ఎక్కువగా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో .. నరసింహు లు ఒంటరి పోరాటం ఏమేరకు ఫలిస్తుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
పార్టీలో ను, కేడర్లోను పట్టున్న నాయకుడిని నిలబెట్టి ఉంటే.. పరిస్థితి బాగుండేదని అంటున్నారు పరిశీలకులు. అయితే.. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని బక్కని నరసింహులు చెబుతున్నారు. అంతేకాదు టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.
కానీ, రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే.. యూత్కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు.. యువతను దృష్టి లో పెట్టుకుని రాజకీయాలు చే్స్తున్నాయి. ఈ క్రమంలో బక్కని వంటివారు యువతను ఆకర్షించడం సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అదే సమయంలో పార్టీకి దూరంగా ఉంటున్నవారు.
పార్టీలోనే ఉంటూ.. అధికార పార్టీతో మిలాఖత్ అయినవారు.. అనేక మంది ఉన్నారు. వీరిని గాడిలో పెట్టడం.. పార్టీని పుంజుకునేలా చేయడం వంటివి.. బక్కనికి కత్తిమీద సామేనని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏవ్యూహంతో ఆయనకు అవకాశం ఇచ్చారో.. బక్కని.. ఎలా పుంజుకుంటారో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 21, 2021 10:17 am
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…