కరోనా ఫస్ట్ దశలోనే ప్రజలు అల్లాడిపోయారు. ఒక వేరియెంట్ ఉంటేనే ప్రాణాలు పోయిన పరిస్థితి కనిపించింది. అయితే.. ఇప్పుడు కరోనా మరింతగా విజృంభించింది. కరోనా వైరస్లో కొత్త రకాలు పుట్టుకొస్తున్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన దేశంలో తొలిసారి వెలుగుచూసింది. అసోంలోని ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు. ఆమె నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు.
ఈ డబుల్ ఇన్ఫె క్షన్పై స్పష్టత కోసం మరోసారి నమూనాలను సేకరించి, పరీక్షించారు. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధరించుకున్నారు. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు. ఆ తర్వాత.. వైద్యురాలు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక, ఇందో చిత్రం ఏంటంటే.. ప్రస్తుతం రెండు వేరియెంట్ల బారిన పడ్డ వైద్యురాలు టీకా రెండు డోసులు వేయించు కున్నారు. అయినప్పటికీ.. ఆమెకు రెండు వేరియెంట్లు ఒకేసారి కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు వైద్య నిపుణులు.
డబుల్ వేరియెంట్లను పరిశీలిస్తే.. ఇప్పటికే ప్రపంచంలో ఒకే ఒక దేశం బెల్జియంలో కేసు వెలుగు చూసింది. ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఈ డబుల్ ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆమెలో ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లను గుర్తించారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ వృద్ధురాలు అసలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలియజేశారు. కానీ, ఇప్పుడు.. దేశంలో తొలి డబుల్ వేరియెంట్ కేసు నమోదు కావడం.. అందునా రెండు డోసుల టీకా తీసుకున్నాక ఇలాంటి లక్షణాలు కనిపించడం.. వంటివి కరోనా తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు వైద్యులు.
This post was last modified on July 20, 2021 4:58 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…