ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో మరోసారి హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఫోన్ కూడా హ్యాకింగ్ కి గురైందంటూ బాంబు పేల్చాడు.
ఇప్పటికి తన ఫోన్ ఐదు సార్లు హ్యాకింగ్ కి గురైందని.. తాను ఐదు సార్లు ఫోన్ మార్చాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ మార్చినా.. హ్యాకింగ్ దాడి జరుగుతూనే ఉందని ఆయన చెప్పడం గమనార్హం.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. ఈ నెల 14న ఆయన ఫోన్ హ్యాకింగ్ కి గురైంది. అయితే.. తాజాగా.. ఇజ్రాయిల్ నుంచి ఇండియా పొందిన ‘స్పైవేర్ పెగాసన్’ ద్వారా దేశవ్యాప్తంగా పలువురి ఫోన్లు హ్యాక్ అయినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ ప్రచురించింది.
అందులో కేంద్ర మంత్రుల నుంచి భద్రతా దళాల చీఫ్ ఆఫీసర్లు, కీలక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, బడా వ్యాపారులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా… అందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…