ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో మరోసారి హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఫోన్ కూడా హ్యాకింగ్ కి గురైందంటూ బాంబు పేల్చాడు.
ఇప్పటికి తన ఫోన్ ఐదు సార్లు హ్యాకింగ్ కి గురైందని.. తాను ఐదు సార్లు ఫోన్ మార్చాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ మార్చినా.. హ్యాకింగ్ దాడి జరుగుతూనే ఉందని ఆయన చెప్పడం గమనార్హం.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. ఈ నెల 14న ఆయన ఫోన్ హ్యాకింగ్ కి గురైంది. అయితే.. తాజాగా.. ఇజ్రాయిల్ నుంచి ఇండియా పొందిన ‘స్పైవేర్ పెగాసన్’ ద్వారా దేశవ్యాప్తంగా పలువురి ఫోన్లు హ్యాక్ అయినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ ప్రచురించింది.
అందులో కేంద్ర మంత్రుల నుంచి భద్రతా దళాల చీఫ్ ఆఫీసర్లు, కీలక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, బడా వ్యాపారులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా… అందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
This post was last modified on July 20, 2021 4:57 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…