Political News

నా ఫోన్ ఐదుసార్లు హ్యాక్ అయ్యింది.. పీకే

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో మరోసారి హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఫోన్ కూడా హ్యాకింగ్ కి గురైందంటూ బాంబు పేల్చాడు.

ఇప్పటికి తన ఫోన్ ఐదు సార్లు హ్యాకింగ్ కి గురైందని.. తాను ఐదు సార్లు ఫోన్ మార్చాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ మార్చినా.. హ్యాకింగ్ దాడి జరుగుతూనే ఉందని ఆయన చెప్పడం గమనార్హం.

ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. ఈ నెల 14న ఆయన ఫోన్ హ్యాకింగ్ కి గురైంది. అయితే.. తాజాగా.. ఇజ్రాయిల్ నుంచి ఇండియా పొందిన ‘స్పైవేర్ పెగాసన్’ ద్వారా దేశవ్యాప్తంగా పలువురి ఫోన్లు హ్యాక్ అయినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ ప్రచురించింది.

అందులో కేంద్ర మంత్రుల నుంచి భద్రతా దళాల చీఫ్ ఆఫీసర్లు, కీలక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, బడా వ్యాపారులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా… అందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

This post was last modified on July 20, 2021 4:57 pm

Share

Recent Posts

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

1 hour ago

సుమంత్… ముందే మేల్కొని ఉండాల్సిందే

అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…

3 hours ago

టాక్ ఎలా ఉన్నా 200 కోట్లు పక్కా

స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…

4 hours ago

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…

4 hours ago

మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…

5 hours ago

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

6 hours ago