ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏం చేస్తోంది? ఎలా ముందుకు సాగుతోంది ? అంటే.. అసలు వదిలేసింది గురూ! అనేకామెంట్ వినిపిస్తోంది. నిజానికి ప్రతిపక్షం అంటే.. ప్రజల మధ్య ఉండాలి. పోనీ.. కరోనా వచ్చిందని తప్పించుకున్నా..ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరువ అవ్వాలి. కమ్యూనిస్టులు, బీజేపీ నేతలు.. ఈ క్రమంలో ప్రజల్లోనే ఉన్నారు.కానీ, టీడీపీ మాత్రం తమ అవసరం వస్తే.. ఒక విధంగా.. ప్రజల విషయానికి వస్తే.. మరో విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలను పూర్తిగా పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షంగా ఉండాలనే విషయం టీడీపీ మరిచిపోయిందని అంటున్నారు.
డిజిటల్ మీడియాను నమ్ముకున్న టీడీపీ.. మున్ముందు .. దీనిని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నే అన్ని జిల్లాల్లోనూ డిజిటల్ టీడీపీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవానికి డిజిటల్ మాధ్యమం అనేది ఎంతమందికి చేరువ అవుతుంది ? ఎంతమంది డిజిటల్తో అనుసంధానమై ఉన్నారు? అనే విషయాలను ఎవరూ పట్టించు కోకపోవడం గమనార్హం. ఇప్పుడున్న ఏపీ జనాభాలో కేవలం 35 శాతం మంది మాత్రమే డిజిటల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. 20 శాతం మంది మాత్రమే డెస్క్టాప్లను వినియోగిస్తున్నారు. ఇక, వీరిలోనూ వారి విధుల కోసం వినియోగిస్తున్నవారే ఎక్కువ.
ఇక, యూత్లో డిజిటల్ మాధ్యమాలపై ఫోకస్ ఉన్నప్పటికీ.. వారు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజకీయ విశ్లేషకులు విమర్శకులు మాత్రమే ఈ డిజిటల్ మీడియా రాజకీయాల విషయంలో ఎడిక్ట్ అయ్యారని.. తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ టీడీపీ చేసే పని ఏంటో.. పార్టీ అధినేతకే తెలియాలని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా ఉంటే ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా.. లేదా.. ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ఆదిశగా అడుగులు వేయడం ద్వారా టీడీపీ పుంజుకుంటుంది తప్ప.. డిజిటల్ టీడీపీ వల్ల.. కనీసం పది ఓట్లు కూడా పడే అవకాశం లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.
మరి అసలు.. ప్రజల మధ్యకు రాకుండా మానేసిన నాయకులను బుజ్జగించో… బామాలో.. లైన్లో పెట్టుకోకుండా.. డిజిటల్ టీడీపీ ద్వారా.. ఇప్పటికే యాక్టివ్గా ఉన్న వారిని మరింతగా సోమరులను చేస్తారా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
This post was last modified on July 20, 2021 11:16 am
ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…
దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…
కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు, గ్యాస్ సమస్యలతో ఇరకాటంలో పడ్డాయి. అనేక దేశాల్లో మారకం…