ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏం చేస్తోంది? ఎలా ముందుకు సాగుతోంది ? అంటే.. అసలు వదిలేసింది గురూ! అనేకామెంట్ వినిపిస్తోంది. నిజానికి ప్రతిపక్షం అంటే.. ప్రజల మధ్య ఉండాలి. పోనీ.. కరోనా వచ్చిందని తప్పించుకున్నా..ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరువ అవ్వాలి. కమ్యూనిస్టులు, బీజేపీ నేతలు.. ఈ క్రమంలో ప్రజల్లోనే ఉన్నారు.కానీ, టీడీపీ మాత్రం తమ అవసరం వస్తే.. ఒక విధంగా.. ప్రజల విషయానికి వస్తే.. మరో విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలను పూర్తిగా పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షంగా ఉండాలనే విషయం టీడీపీ మరిచిపోయిందని అంటున్నారు.
డిజిటల్ మీడియాను నమ్ముకున్న టీడీపీ.. మున్ముందు .. దీనిని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నే అన్ని జిల్లాల్లోనూ డిజిటల్ టీడీపీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవానికి డిజిటల్ మాధ్యమం అనేది ఎంతమందికి చేరువ అవుతుంది ? ఎంతమంది డిజిటల్తో అనుసంధానమై ఉన్నారు? అనే విషయాలను ఎవరూ పట్టించు కోకపోవడం గమనార్హం. ఇప్పుడున్న ఏపీ జనాభాలో కేవలం 35 శాతం మంది మాత్రమే డిజిటల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. 20 శాతం మంది మాత్రమే డెస్క్టాప్లను వినియోగిస్తున్నారు. ఇక, వీరిలోనూ వారి విధుల కోసం వినియోగిస్తున్నవారే ఎక్కువ.
ఇక, యూత్లో డిజిటల్ మాధ్యమాలపై ఫోకస్ ఉన్నప్పటికీ.. వారు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజకీయ విశ్లేషకులు విమర్శకులు మాత్రమే ఈ డిజిటల్ మీడియా రాజకీయాల విషయంలో ఎడిక్ట్ అయ్యారని.. తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ టీడీపీ చేసే పని ఏంటో.. పార్టీ అధినేతకే తెలియాలని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా ఉంటే ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా.. లేదా.. ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ఆదిశగా అడుగులు వేయడం ద్వారా టీడీపీ పుంజుకుంటుంది తప్ప.. డిజిటల్ టీడీపీ వల్ల.. కనీసం పది ఓట్లు కూడా పడే అవకాశం లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.
మరి అసలు.. ప్రజల మధ్యకు రాకుండా మానేసిన నాయకులను బుజ్జగించో… బామాలో.. లైన్లో పెట్టుకోకుండా.. డిజిటల్ టీడీపీ ద్వారా.. ఇప్పటికే యాక్టివ్గా ఉన్న వారిని మరింతగా సోమరులను చేస్తారా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
This post was last modified on July 20, 2021 11:16 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…