Political News

అస‌లు వ‌దిలేసి.. టీడీపీ కొస‌రు రాజ‌కీయం..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏం చేస్తోంది? ఎలా ముందుకు సాగుతోంది ? అంటే.. అస‌లు వ‌దిలేసింది గురూ! అనేకామెంట్ వినిపిస్తోంది. నిజానికి ప్ర‌తిప‌క్షం అంటే.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాలి. పోనీ.. క‌రోనా వ‌చ్చింద‌ని త‌ప్పించుకున్నా..ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాలి. క‌మ్యూనిస్టులు, బీజేపీ నేత‌లు.. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు.కానీ, టీడీపీ మాత్రం త‌మ అవ‌స‌రం వ‌స్తే.. ఒక విధంగా.. ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే.. మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టారనే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షం అంటేనే ప్ర‌జ‌ల ప‌క్షంగా ఉండాల‌నే విష‌యం టీడీపీ మ‌రిచిపోయింద‌ని అంటున్నారు.

డిజిట‌ల్ మీడియాను న‌మ్ముకున్న టీడీపీ.. మున్ముందు .. దీనిని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో నే అన్ని జిల్లాల్లోనూ డిజిట‌ల్ టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. వాస్త‌వానికి డిజిట‌ల్ మాధ్య‌మం అనేది ఎంత‌మందికి చేరువ అవుతుంది ? ఎంత‌మంది డిజిట‌ల్‌తో అనుసంధానమై ఉన్నారు? అనే విష‌యాల‌ను ఎవ‌రూ పట్టించు కోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడున్న ఏపీ జ‌నాభాలో కేవ‌లం 35 శాతం మంది మాత్ర‌మే డిజిట‌ల్ ఫోన్ల‌ను వినియోగిస్తున్నారు. 20 శాతం మంది మాత్ర‌మే డెస్క్‌టాప్‌ల‌ను వినియోగిస్తున్నారు. ఇక‌, వీరిలోనూ వారి విధుల కోసం వినియోగిస్తున్న‌వారే ఎక్కువ‌.

ఇక‌, యూత్‌లో డిజిట‌ల్ మాధ్య‌మాల‌పై ఫోక‌స్ ఉన్న‌ప్ప‌టికీ.. వారు రాజ‌కీయాల ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. కేవ‌లం రాజ‌కీయ విశ్లేష‌కులు విమ‌ర్శ‌కులు మాత్రమే ఈ డిజిట‌ల్ మీడియా రాజకీయాల విష‌యంలో ఎడిక్ట్ అయ్యార‌ని.. తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిట‌ల్ టీడీపీ చేసే ప‌ని ఏంటో.. పార్టీ అధినేత‌కే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదైనా ఉంటే ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా ఉప‌యోగ‌ప‌డేలా.. లేదా.. ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని ఆదిశ‌గా అడుగులు వేయ‌డం ద్వారా టీడీపీ పుంజుకుంటుంది త‌ప్ప‌.. డిజిట‌ల్ టీడీపీ వ‌ల్ల‌.. క‌నీసం ప‌ది ఓట్లు కూడా ప‌డే అవ‌కాశం లేద‌ని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.

మ‌రి అస‌లు.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాకుండా మానేసిన నాయ‌కుల‌ను బుజ్జ‌గించో… బామాలో.. లైన్‌లో పెట్టుకోకుండా.. డిజిట‌ల్ టీడీపీ ద్వారా.. ఇప్ప‌టికే యాక్టివ్గా ఉన్న వారిని మ‌రింత‌గా సోమ‌రుల‌ను చేస్తారా? అనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

This post was last modified on July 20, 2021 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

2 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

7 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

7 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

8 hours ago