ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెల్లుబికే లా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలను రేవంత్కు ఇవ్వడం ఇష్టంలేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో రేవంత్కు కష్టాలు తప్పవని.. పార్టీ పుంజుకోవడం కష్టమని.. పెద్ద ఎత్తున విశ్లేషణలు, విమర్శలు వచ్చాయి. అయితే.. వీటిని సవాలుగా తీసుకున్న రేవంత్.. ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ పటిష్టతకు.. నడుంబిగించారు. దీనిలో భాగంగా రేవంత్.. ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికివారు.. తమకు తామే పెద్దలమని చెప్పు కొంటారు కూడా. ఈ క్రమంలో రేవంత్ను గుర్తించడం కష్టమే. దీనిని గమనించిన రేవంత్.. ప్రతి ఒక్క నేతను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యంలోనే విమర్శలను పొడచూపకుండా.. ఆయన అడుగులు వేస్తున్నారు. అదేసమయంలో పార్టీని పుంజుకునేలా చేసేవారికి పార్టీని గెలిపించేవారికి.. ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతోపాటు.. గత 2018 ఎన్నికల్లో విజయం సాధించి.. తర్వాత అధికార పార్టీలో చేరి పదువులు దక్కించుకున్నవారిపై.. తనదైన శైలిలో.. రేవంత్.. రాజకీయ వ్యూహానికి తెరదీశారు.
12 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేలా అటు న్యాయ పోరాటం.. ఇటు రాజకీయంగా వారిని ప్రజాకోర్టులో నిలదీసే కార్యక్రమాలను తీవ్రతరం చేశారు. ఇక, కాంగ్రెస్ను సామాజిక వర్గాల వారీగా బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా.. ఇతర పార్టీల్లో ఉంటూ.. ఒకింత స్తబ్దుగా ఉన్న నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానించే కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. పార్టీ చీఫ్ దగ్గరకు నాయకులు రావడం అనే సంప్రదాయానికి భిన్నంగా.. సమస్యలు ఉన్న చోట.. తానే ప్రత్యక్షమవడం.. నేతలను తానే కలుసుకోవడం అనే సరికొత్త సంప్రదాయానికి రేవంత్ తెరదీసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం.. పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. దీనిని బట్టి.. రేవంత్ను అనుసరించక తప్పని పరిస్థితి సీనియర్లలోనూ కలగడం గమనార్హం.
This post was last modified on July 20, 2021 9:43 am
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…