ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెల్లుబికే లా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలను రేవంత్కు ఇవ్వడం ఇష్టంలేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో రేవంత్కు కష్టాలు తప్పవని.. పార్టీ పుంజుకోవడం కష్టమని.. పెద్ద ఎత్తున విశ్లేషణలు, విమర్శలు వచ్చాయి. అయితే.. వీటిని సవాలుగా తీసుకున్న రేవంత్.. ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ పటిష్టతకు.. నడుంబిగించారు. దీనిలో భాగంగా రేవంత్.. ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికివారు.. తమకు తామే పెద్దలమని చెప్పు కొంటారు కూడా. ఈ క్రమంలో రేవంత్ను గుర్తించడం కష్టమే. దీనిని గమనించిన రేవంత్.. ప్రతి ఒక్క నేతను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యంలోనే విమర్శలను పొడచూపకుండా.. ఆయన అడుగులు వేస్తున్నారు. అదేసమయంలో పార్టీని పుంజుకునేలా చేసేవారికి పార్టీని గెలిపించేవారికి.. ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతోపాటు.. గత 2018 ఎన్నికల్లో విజయం సాధించి.. తర్వాత అధికార పార్టీలో చేరి పదువులు దక్కించుకున్నవారిపై.. తనదైన శైలిలో.. రేవంత్.. రాజకీయ వ్యూహానికి తెరదీశారు.
12 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేలా అటు న్యాయ పోరాటం.. ఇటు రాజకీయంగా వారిని ప్రజాకోర్టులో నిలదీసే కార్యక్రమాలను తీవ్రతరం చేశారు. ఇక, కాంగ్రెస్ను సామాజిక వర్గాల వారీగా బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా.. ఇతర పార్టీల్లో ఉంటూ.. ఒకింత స్తబ్దుగా ఉన్న నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానించే కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. పార్టీ చీఫ్ దగ్గరకు నాయకులు రావడం అనే సంప్రదాయానికి భిన్నంగా.. సమస్యలు ఉన్న చోట.. తానే ప్రత్యక్షమవడం.. నేతలను తానే కలుసుకోవడం అనే సరికొత్త సంప్రదాయానికి రేవంత్ తెరదీసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం.. పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. దీనిని బట్టి.. రేవంత్ను అనుసరించక తప్పని పరిస్థితి సీనియర్లలోనూ కలగడం గమనార్హం.
This post was last modified on July 20, 2021 9:43 am
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…