Political News

అస్త్రాలు సిద్ధం చేసుకున్న టీడీపీ..

సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగ‌నుం దని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ ప్ర‌బుత్వ వైఫ‌ల్యాల‌ను పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌శ్నించేందుకు టీడీపీ ఎంపీలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. వైసీపీని నిల‌దీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య పార్ల‌మెంటు వేదిక‌గా వాగ్యుద్ధం జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ సమావేశంలో 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చ జరపాలని కేంద్రానికి టీడీపీ ప్రతిపాదనలు పంపింది. కొవిడ్ పరిస్థితులు, ఎంపీ లాడ్స్పై చర్చ జరపాలని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో ఏపీకి సంబంధించిన‌ ప్రత్యేక హోదా, విభజన హామీలపై సైతం చర్చించాలని ప‌ట్టుబ‌ట్ట‌నున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అటు తెలంగాణను, ఇటు కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రం ఉంద‌న్న నేప‌థ్యంలో ఈ అంశాన్ని కూడా టీడీపీ గ‌ట్టిగా పార్ల‌మెంటులో నిల‌దీయాల‌ని నిర్ణ‌యించుకుంది.

అదేస‌మ‌యంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని పార్ల‌మెంటు వేదిక‌గా టీడీపీ ఎంపీలు ప్ర‌శ్నించ‌నున్నారు. జీతాలు సైతం చెల్లించలేని స్థితిలో ఉండ‌డాన్ని పార్ల‌మెంటు దృష్టికి తీసుకువెళ్లి సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌నున్నారు. దేవాలయాలపై దాడుల వ్యవహారంలో దర్యాప్తు, రాజద్రోహం 124ఏ సెక్షన్ దుర్వినియోగం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించ‌డాన్ని బ‌ట్టి.. పార్ల‌మెంటులో ఆయా అంశాలు కూడా చ‌ర్చ‌కు రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, రైతు ఉద్యమం, పంటలకు మద్దతు ధరపై చర్చ జరపాలని కేంద్రంపైనా ఒత్తిడి తేనున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్ర‌త్యేకంగా ఇవ్వ‌నున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు అవసరమైతే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయటానికైనా సిద్ధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రం కోసం పోరాడాలనే నినాదాన్ని పార్లమెంటులో ప్ర‌స్తావించి ఒత్తిడి తేనున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి టీడీపీ ఎంపీలు పార్ల‌మెంటు వేదిక‌గా గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

8 minutes ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

35 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

1 hour ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

4 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago