Political News

ఆ మూడు కార్పొరేష‌న్లూ.. రెడ్ల‌కే.. రీజ‌నేంటి?

రాష్ట్రంలో జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని.. మ‌హిళా సాధికార‌త‌కు ఇవి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్న స‌ర్కారు.. వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగుల‌ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

మొత్తం కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని చెబుతున్నా.. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చామ‌ని చెప్పుకొంటున్నా.. కీల‌క‌మైన ప‌దవుల‌ను మాత్రం త‌న సొంత సామాజిక వ‌ర్గానికే అప్ప‌గించార‌ని.. సీఎం జ‌గ‌న్‌పై ఇటు రాజ‌కీయంగా.. అటు సోష‌ల్ మీడియా ప‌రంగా కూడా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ప్ర‌క‌టించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో మూడు కీల‌క‌మైన వాటిని చూసుకుంటే.. వీటిని మ‌హిళ‌ల‌కు కాకుండా.. పురుషుల‌కే కేటాయించారు. అది కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి కేటాయించారు. రాష్ట్రంలో కీల‌క‌మైన‌.. ఏపీఐఐసీ చైర్మ‌న్, టీటీడీ చైర్మ‌న్‌, మారిటైం బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్‌గా నిన్న మొన్న‌టి వ‌రకు జ‌గ‌న్ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డే ఉన్నారు. అయితే.. బోర్డు కాల ప‌రిమితి ముగియ‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించినా.. వెంట‌నే మ‌ళ్లీ ఆయ‌న‌కే ప‌గ్గాలు అప్ప‌గించారు. వాస్త‌వానికి దీనిని చంద్ర‌బాబు గ‌తంలో బీసీ వ‌ర్గానికి కేటాయించి.. మంచి సంప్ర‌దాయానికి నాందిప‌లికార‌నే వాద‌న ఉంది.

ఈ క్ర‌మంలో టీటీడీ బోర్డు విష‌యంలో ఈ ద‌ఫా.. జ‌గ‌న్ బీసీ వ‌ర్గానికి కేటాయిస్తార‌ని అనుకున్నా.. మ‌రోసారి బాబాయికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఏపీఐఐసీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రెడ్డి సామాజిక వ‌ర్గానికిచెందిన‌.. రోజా ఉన్నారు. అయితే.. ఆమెను త‌ప్పించారు. ఈ క్ర‌మంలో దీనిని ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తార‌ని అనుకున్నా.. మ‌ళ్లీ దీనిని రెడ్డి వ‌ర్గానికే అందునా పురుష అభ్య‌ర్థికే కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిని మెట్లు గోవింద రెడ్డికి క‌ట్ట‌బెట్టారు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన ఆదాయం వ‌చ్చే రంగం.. మారిటైం బోర్డు. దీనికి కూడా చైర్మ‌న్‌గా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వెంక‌ట‌రెడ్డిని నియ‌మించారు.

దీంతో అత్యంత కీల‌క‌మైన మూడు రంగాల‌కూ జ‌గ‌న్‌.. త‌న సొంత సామాజిక‌వ ర్గాన్నే కేటాయించ‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి దీనిపై వైసీపీ నేత‌లు ఏమంటారో చూడాలి. అయితే.. రెడ్డి సామాజిక వ‌ర్గ‌మైతేనే త‌న‌కు న‌మ్మ‌కంగా ఉంటుంద‌ని.. లేదా త‌ను చెప్పిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని.. జ‌గ‌న్ విశ్వ‌సిస్తున్న‌ట్టు తెలుస్తోంద‌ని.. అందుకే వారికే కేటాయించార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. సామాజిక న్యాయం చేశామంటున్నా.. కీల‌క ప‌ద‌వుల‌ను మాత్రం రెడ్డి వ‌ర్గానికి కేటాయించ‌డంపై మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 18, 2021 12:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago