Political News

పవార్ కు మోడి గాలమేస్తున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మహారాష్ట్రలోని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్డీయే కు బలమైన ప్రత్యర్ధిగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం అందరు చూస్తున్నదే.

ఇలాంటి నేపధ్యంలో మోడి-పవార్ భేటీ జరగటం సంచలనంగా మారింది. ఎలాగైనా పవార్ ను ఎన్డీయేలోకి లాక్కోవాలనే ప్రయత్నాలు ఎప్పటినుండో జరుగుతున్నాయి. అయితే ఆ ప్రయత్నాలకు పవార్ దూరంగా జరుగుతున్నారు. ఇలాంటి సమయంలోనే హఠాత్తుగా వీళ్ళద్దరి భేటి దేనికి సంకేతాలో అర్ధం కావటంలేదు. మహారాష్ట్రలో సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయరంగంలో నుండి సహకార రంగాన్ని విడదీసి కేంద్రం ప్రత్యేకమైన శాఖకు ఏర్పాటుచేసింది.

ఈ విధంగా ఏర్పడిన సహకార శాఖలో వేలకోట్ల రూపాయల రుణాలు పేరుకుపోయున్నాయి. వీటిల్లో అత్యధికం మహారాష్ట్ర వాటానే ఉంది. ఇందులో కూడా ఎన్సీపీ నేతలదే ఎక్కువ షేరుందట. అంటే సహకారరంగంలో తీసుకున్న వందల కోట్ల రూపాయల రుణలను కొందరు ఎన్సీసీ నేతలు ఎగొట్టారట. దాంతో రుణాలు ఎగొట్టిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు దాడులు చేయటమే కాకుండా కేసులు నమోదు చేస్తోంది. ఈ విషయం మాట్లాడేందుకే మోడితో పవార్ భేటీ అయినట్లు సమాచారం.

మొత్తానికి ఏదో రూపంలో పవార్ ను మోడి తన దగ్గరకు రప్పించుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఇపుడు రప్పించుకున్నారు సరే తర్వాత స్టెప్ ఏమిటి అనేదే అందరికీ అర్ధం కావటంలేదు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య విభేదాలు తెచ్చి విగడొట్టడమే ప్రధమ కర్తవ్యంగా బీజేపీ పావులు కదుపుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. అలాగే విడగొట్టిన తర్వాత వీలైతే శివసేనను లేకపోతే పవార్ ను ఎన్డీయేలోకి లాక్కోవాలనే అజెండాతోనే మోడి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీళ్ళద్దరి తాజా భేటీ పర్యవసానాలు ఎలాగుంటాయ్ చూడాల్సిందే.

This post was last modified on July 18, 2021 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

43 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago