ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఆయన దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధానిని మారుస్తూ.. మూడు రాజధానులుగా నిర్ణయించారు. దీనిపై ప్రజలు, రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా సీఎంగా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా తిరిగితోడుతున్న జగన్.. రాజధాని పరిధిలోని కరకట్ట సమీపంలో చంద్రబాబు ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు.
దాదాపు 8 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధమంటూ.. జగన్ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. జగన్ దూకుడుగానే ముందుకు సాగారు. ఇక, ఇప్పుడు రాజధాని పరిధిలో మరో కూల్చివేతకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అమల్లో కూడా పెట్టేశారు.
విజయవాడ-అమరావతి రాజధానిని కలుపుతూ.. చంద్రబాబు హయాంలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ వంతెన నిర్మాణ పనులను సీఎం జగన్ ఆదేశాల మేరకు.. అదికారులు కూల్చేస్తున్నారు.
గడిచిన వారం రోజులుగా ఇక్కడ నిశ్శబ్దంగా కూల్చివేత పనులు జరుగుతుండడం గమనార్హం. ఐకానిక్ వంతెన నిర్మాణానికి సంభందించి వేసిన పునాదులను కూల్చేశారు. చంద్రబాబు హయాంలో ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ.. దీని కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దాదాపు 1327 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తాజాగా జగన్ కూల్చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
విజయవాడలోని గొల్లపూడి సమీపం నుంచి అమరావతిలోని కీలక పట్టణంగా మారనున్న ఉద్దండరాయుని పాలెం వరకు ఈ ఐకానిక్ వంతెనను నిర్మించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడం.. జగన్.. అధికారంలోకి రావడం.. చంద్రబాబు ఛాయలు లేకుండా చేయాలనే రాజకీయ వ్యూహం అనుసరించడంతో.. అమరావతిలో ఒక్కక్కటీ కూల్చివేత దిశగా సాగుతున్నాయి.
This post was last modified on July 17, 2021 4:29 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…