ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఆయన దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధానిని మారుస్తూ.. మూడు రాజధానులుగా నిర్ణయించారు. దీనిపై ప్రజలు, రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా సీఎంగా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా తిరిగితోడుతున్న జగన్.. రాజధాని పరిధిలోని కరకట్ట సమీపంలో చంద్రబాబు ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు.
దాదాపు 8 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధమంటూ.. జగన్ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. జగన్ దూకుడుగానే ముందుకు సాగారు. ఇక, ఇప్పుడు రాజధాని పరిధిలో మరో కూల్చివేతకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అమల్లో కూడా పెట్టేశారు.
విజయవాడ-అమరావతి రాజధానిని కలుపుతూ.. చంద్రబాబు హయాంలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ వంతెన నిర్మాణ పనులను సీఎం జగన్ ఆదేశాల మేరకు.. అదికారులు కూల్చేస్తున్నారు.
గడిచిన వారం రోజులుగా ఇక్కడ నిశ్శబ్దంగా కూల్చివేత పనులు జరుగుతుండడం గమనార్హం. ఐకానిక్ వంతెన నిర్మాణానికి సంభందించి వేసిన పునాదులను కూల్చేశారు. చంద్రబాబు హయాంలో ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ.. దీని కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దాదాపు 1327 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తాజాగా జగన్ కూల్చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
విజయవాడలోని గొల్లపూడి సమీపం నుంచి అమరావతిలోని కీలక పట్టణంగా మారనున్న ఉద్దండరాయుని పాలెం వరకు ఈ ఐకానిక్ వంతెనను నిర్మించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడం.. జగన్.. అధికారంలోకి రావడం.. చంద్రబాబు ఛాయలు లేకుండా చేయాలనే రాజకీయ వ్యూహం అనుసరించడంతో.. అమరావతిలో ఒక్కక్కటీ కూల్చివేత దిశగా సాగుతున్నాయి.
This post was last modified on July 17, 2021 4:29 pm
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…