వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఎదురైంది. పార్టీలో ప్రస్తుతం రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నా ఆమెకు కనీసం మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ విషయంలో ఆమె బాధపడకుండా ఉండేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టపెట్టారు. కాగా.. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించడం గమనార్హం.
ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాని తొలగించి.. ఆ పదవిని మెట్టు గోవర్థన్ రెడ్డికి అప్పగిస్తూ.. వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రోజా సహా.. ఆమె అభిమానులు సైతం షాకయ్యారు. మంత్రి పదవి ఇవ్వకపోగా.. ఉన్న పదవి నుంచి కూడా తీసేయడం ఎంత వరకు న్యాయమంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. మరో వైపు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సైతం షాక్ తగిలింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేస్తున్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.
రాష్ట్ర స్థాయిలో రెండు పదవుల విధానానికి ముగింపు పలకాలని జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంలో భాగంగానే .. కొందరు ఎమ్మెల్యేలు ఇలా పదవులు పోగొట్టుకోవాల్సి రావడం గమనార్హం.
This post was last modified on July 17, 2021 2:22 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…