వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఎదురైంది. పార్టీలో ప్రస్తుతం రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నా ఆమెకు కనీసం మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ విషయంలో ఆమె బాధపడకుండా ఉండేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టపెట్టారు. కాగా.. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించడం గమనార్హం.
ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాని తొలగించి.. ఆ పదవిని మెట్టు గోవర్థన్ రెడ్డికి అప్పగిస్తూ.. వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రోజా సహా.. ఆమె అభిమానులు సైతం షాకయ్యారు. మంత్రి పదవి ఇవ్వకపోగా.. ఉన్న పదవి నుంచి కూడా తీసేయడం ఎంత వరకు న్యాయమంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. మరో వైపు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సైతం షాక్ తగిలింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేస్తున్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.
రాష్ట్ర స్థాయిలో రెండు పదవుల విధానానికి ముగింపు పలకాలని జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంలో భాగంగానే .. కొందరు ఎమ్మెల్యేలు ఇలా పదవులు పోగొట్టుకోవాల్సి రావడం గమనార్హం.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…