ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధం కావటంలేదు. దశాబ్దాలుగా ఉన్న తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చేసింది ప్రభుత్వం. అకాడమి పేరును హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. పైగా అకాడమిలో తెలుగుతో ఏమాత్రం సంబంధం లేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించటం మరీ విచిత్రంగా ఉంది.
తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చారు కాబట్టి సంస్కృత భాషలో ప్రవేశం ఉన్న వాళ్ళని పాలకమండిలిలో సభ్యులుగా వేశారు బాగానే ఉంది. మరి ఏమి సంబంధం ఉందని కెమిస్ట్రీ రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ రాజకుమార్ నేరెళ్ళ, బీఈడీ కాలేజీ లెక్షిరర్ కప్పగంతు రామకృష్ణను నియమించిందో ప్రభుత్వానికే తెలియాలి.
తెలుగు అకాడమి పాలకమండలిలో ఛైర్మన్ గా కానీ లేకపోతే పాలకమండలిలో సభ్యులుగా తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన, చేస్తున్న వారిని సభ్యులుగా వేయాలే కానీ ఎవరిని బడితే వారిని వేయకూడదు. ఆమాట కొస్తే తెలుగు భాషాభివృద్ధి కోసం ఛైర్ పర్సన్ గా ఉన్న లక్ష్మీపార్వతి చేసిన సేవలు, కృషి ఏమిటో కూడా చాలామందికి తెలీదు.
స్కూళ్ళల్లోనే తెలుగు మీడియంను ఎత్తేయాలని ఒకవైపు ప్రయత్నాలు చేస్తు మరోవైపు తెలుగు అకాడమికి నిధులివ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇది చాలదన్నట్లు ఇపుడు ఏకంగా పేరునే మార్చేసింది. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి కానీ అకాడమికి కానీ జరిగే మంచి ఏమిటో ? వచ్చే పేరేమిటో అర్ధం కావటంలేదు.
This post was last modified on July 11, 2021 4:08 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…