ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధం కావటంలేదు. దశాబ్దాలుగా ఉన్న తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చేసింది ప్రభుత్వం. అకాడమి పేరును హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. పైగా అకాడమిలో తెలుగుతో ఏమాత్రం సంబంధం లేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించటం మరీ విచిత్రంగా ఉంది.
తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చారు కాబట్టి సంస్కృత భాషలో ప్రవేశం ఉన్న వాళ్ళని పాలకమండిలిలో సభ్యులుగా వేశారు బాగానే ఉంది. మరి ఏమి సంబంధం ఉందని కెమిస్ట్రీ రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ రాజకుమార్ నేరెళ్ళ, బీఈడీ కాలేజీ లెక్షిరర్ కప్పగంతు రామకృష్ణను నియమించిందో ప్రభుత్వానికే తెలియాలి.
తెలుగు అకాడమి పాలకమండలిలో ఛైర్మన్ గా కానీ లేకపోతే పాలకమండలిలో సభ్యులుగా తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన, చేస్తున్న వారిని సభ్యులుగా వేయాలే కానీ ఎవరిని బడితే వారిని వేయకూడదు. ఆమాట కొస్తే తెలుగు భాషాభివృద్ధి కోసం ఛైర్ పర్సన్ గా ఉన్న లక్ష్మీపార్వతి చేసిన సేవలు, కృషి ఏమిటో కూడా చాలామందికి తెలీదు.
స్కూళ్ళల్లోనే తెలుగు మీడియంను ఎత్తేయాలని ఒకవైపు ప్రయత్నాలు చేస్తు మరోవైపు తెలుగు అకాడమికి నిధులివ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇది చాలదన్నట్లు ఇపుడు ఏకంగా పేరునే మార్చేసింది. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి కానీ అకాడమికి కానీ జరిగే మంచి ఏమిటో ? వచ్చే పేరేమిటో అర్ధం కావటంలేదు.
This post was last modified on July 11, 2021 4:08 pm
వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…
ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…
సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…
నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…
ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…
ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…