తెలంగాణ కాంగ్రెస్లో అప్పుడే.. మరో వివాదం తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్రెడ్డికి సీనియర్ల నుంచి సపోర్ట్ ఉండే పరిస్థితి లేదు. పలువురు సీనియర్ నేతలు సైతం రేవంత్ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేతలను కలుస్తూ సర్దిచెప్పుకుంటూ వస్తోన్న రేవంత్పై ఇప్పుడు మరో కీలక నేత కత్తిదూస్తోన్న పరిస్థితి. అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్గా ఉన్న మాజీ మంత్రి భట్టివిక్రమార్కకు పడడం లేదని.. పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి కాంగ్రెస్లో చాలా సీనియర్. ఆయన సోదరుడు మల్లు రవి కూడా పార్టీలో కీలక నేత. అయితే.. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అందరిలోనూ ఉన్నట్టే.. భట్టి విక్రమార్క కూడా కొందరి పేర్లను సూచించారు.
వారిని కాదని.. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్కు పగ్గాలు అప్పగించడం భట్టి వర్గానికి ఇష్టం లేదు. అంతే కాదు.. తన సొంత జిల్లాలో మాజీ ఎంపీ రేణుకతో విభేదించే భట్టి.. రేవంత్ను రేణుక వర్గంగానే చూస్తున్నారు. ఆయనకు పీసీసీ రావడం వెనుక రేణుక ప్రమేయం కూడా ఉందని ఆయన భావిస్తున్నారు. రేణుక ముందు నుంచి రేవంత్కు సపోర్ట్ చేస్తుండడంతో పాటు జిల్లా కాంగ్రెస్లో కొన్ని వర్గాలను ఎదగనీయలేదు. ఈ క్రమంలోనే ఆమెకు ఢిల్లీలో పట్టు ఉండడంతో రేవంత్కు పదవి వచ్చే విషయంలో తన వంతుగా చక్రం తిప్పారని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ క్రమంలోనే రేవంత్ ఇటీవల హైదరాబాద్లో రేణుక ఇంట్లో సమావేశం నిర్వహించి.. ఆహ్వానించినా.. భట్టి మాత్రం రాలేదు. అంతేకాదు.. ఆయన వర్గంగా ఉన్న కొందరు నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇక, సీనియర్లను కలిసి ఆశీస్సులు తీసుకుంటున్న రేవంత్ .. భట్టిని కలిసేందుకుప్రయత్నించగా.. ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో మల్లు రవి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ రెండు పరిణామాలతోనూ రేవంత్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆల్రెడీ భట్టిపై అక్కసుతో ఉన్న రేణుకా చౌదరి వర్గం.. రేవంత్ కు దగ్గరవుతోంది.
ఈ పరిణామం భట్టికి నచ్చడం లేదు. దీంతో రేవంత్ వర్సెస్ భట్టి అనే స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా పార్టీలో కీలకంగా వ్యవహరించాల్సిన నాయకులు.. ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు చర్చలు నడుస్తున్నాయి. దీనికి కారణం.. ఖమ్మం రాజకీయాలేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిణామం ఎటు దారితీస్తుందో ? చూడాలి.
This post was last modified on July 11, 2021 4:04 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…