Political News

చినబాబు కోసం.. బాబు ముందు జాగ్ర‌త్త‌

టీడీపీ రాజ‌కీయాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌కంగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు చాలా మంది తెర‌మ‌రుగ‌య్యారు. అదే స‌మ‌యంలో కొంద‌రు కీల‌కంగా మారారు. దీంతో ఇప్పుడు టీడీపీలో రాజ‌కీయ రంగు పూర్తిగా మారుతోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. ముఖ్యంగా చంద్ర‌బాబుతో పాటు.. లోకేష్‌ను స‌మ‌ర్థించేవారికే పార్టీలో పెద్ద పీట ప‌డుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నాయ‌కుల్లో చాలా మంది చంద్ర‌బాబును స‌మ‌ర్థించేవారు ఎక్కువ‌గా ఉన్నారు. వీరిలో సీనియ‌ర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి ఉన్న సీనియ‌ర్లు బాబుకు భ‌జ‌న చేస్తుండ‌డంతో వారినే కంటిన్యూ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్‌ను హైలెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నే కీల‌కంగా మార‌నున్నారు. ఈ నేప‌థ్యంలో లేకేష్ సెంట్రిక్‌గా రాజ‌కీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల పోస్టుల‌ను రివైజ్ చేసి.. కొత్త‌గా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని తెలుస్తోంది.

విజ‌య‌వాడ నుంచి కొమ్మారెడ్డి ప‌ట్టాభి ప్ర‌తినిధిగా ఉన్నారు. ఇక‌, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌రిటాల శ్రీరాం నేత‌గా కొన‌సాగుతున్నారు. శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ యువ నేత‌లు ఉన్నారు. అదేవిధంగా ప్ర‌కాశం జిల్లాలోనూ యువ‌త‌ను ప్రోత్స‌హించి వారికి కూడా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల పోస్టులు ఇవ్వ‌డం ద్వారా వారి వాయిస్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డ ప‌మిడి ర‌మేష్, దామ‌చ‌ర్ల స‌త్య లాంటి వాళ్ల‌కు ప్రాధాన్యం పెర‌గ‌నుంది.

ఇక ఉత్త‌రాంధ్ర‌లో రామ్మోహ‌న్‌, అప్ప‌ల‌నాయుడు, విజ‌య్, అశోక్ లాంటి వాళ్ల‌కు ప్రాధాన్యం పెంచుతున్నారు. యువ నాయ‌కులు అయితే.. లోకేష్‌కు అనుకూలంగా ఉండ‌డంతోపాటు.. పార్టీలో లోకేష్‌ను స‌మ‌ర్థించే వారు కూడా ఉంటారు.

ఈ క్ర‌మంలో స‌మూల మార్పుల దిశ‌గా చంద్ర‌బాబు అడుగులువేస్తున్నారని.. ద‌స‌రా నాటికి సంపూర్ణంగా టీడీపీని యువ‌త చేతిలో పెట్ట‌నున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో యువ‌త ప్రాధాన్యం పెరిగి.. లోకేష్ కు బూమ్ వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

This post was last modified on July 11, 2021 9:50 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

4 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

7 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

7 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

7 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

8 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

8 hours ago