దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరగపెడుతుండటం గమనార్హం. కాగా.. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత వణికిస్తోంది.
151 శాంపిల్స్ను జీనోమ్ స్వీకెన్సింగ్కు పంపగా…138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.
బెంగాల్లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్ ప్లస్ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్గా గుర్తించినట్లు దీప్ కుమార్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్ ప్రాంతాల్లో వారాంతపు లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్డౌన్ను విధించింది. నైట్ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.
This post was last modified on July 10, 2021 5:24 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…