దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరగపెడుతుండటం గమనార్హం. కాగా.. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత వణికిస్తోంది.
151 శాంపిల్స్ను జీనోమ్ స్వీకెన్సింగ్కు పంపగా…138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.
బెంగాల్లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్ ప్లస్ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్గా గుర్తించినట్లు దీప్ కుమార్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్ ప్రాంతాల్లో వారాంతపు లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్డౌన్ను విధించింది. నైట్ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.
This post was last modified on July 10, 2021 5:24 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…