దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరగపెడుతుండటం గమనార్హం. కాగా.. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత వణికిస్తోంది.
151 శాంపిల్స్ను జీనోమ్ స్వీకెన్సింగ్కు పంపగా…138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.
బెంగాల్లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్ ప్లస్ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్గా గుర్తించినట్లు దీప్ కుమార్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్ ప్రాంతాల్లో వారాంతపు లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్డౌన్ను విధించింది. నైట్ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.
This post was last modified on July 10, 2021 5:24 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…