దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరగపెడుతుండటం గమనార్హం. కాగా.. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత వణికిస్తోంది.
151 శాంపిల్స్ను జీనోమ్ స్వీకెన్సింగ్కు పంపగా…138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.
బెంగాల్లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్ ప్లస్ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్గా గుర్తించినట్లు దీప్ కుమార్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్ ప్రాంతాల్లో వారాంతపు లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్డౌన్ను విధించింది. నైట్ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.
This post was last modified on July 10, 2021 5:24 pm
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…