కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రెండు వ్యాక్సిన్ల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని యూరిపియన్ మెడికల్ ఏజెన్సీ పేర్కొంది.
ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు యూరోపియన్ వైద్య నియంత్రణాధికారులు తెలిపారు. యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అధికారులు మాట్లాడుతూ… చాలా సాధారణంగా ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్న పురుషుల్లో స్వల్పంగా గుండె కణాల్లో వాపు కనిపిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎక్కువ స్థాయిలో లాభం జరుగుతుందన్నారు. ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో గుండె కణాల్లో వాపు వస్తున్న కారణంగా రోగులు, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో కొంతమందికి ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండె మంట లాంటి లక్షణాలు నమోదయినట్లు యురోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని సూచించింది. ఫైజర్ టీకా తీసుకున్న 17.7 కోట్ల మందిలో.. 145 మందికి మయోకార్డిటిస్, 138 మందిలో పెరికార్డిటిస్ లాంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు చెప్పారు.
మోడెర్నా టీకా తీసుకున్న 2 కోట్ల మందిలో 19 మయోకార్డిటిస్, 19 పెరీకార్డిటిస్ కేసులు నమోదు అయ్యాయని యురోపియన్ ఏజెన్సీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల్లో మయోకార్డిటిస్ లక్షణాలు కనిపించే అవకాశముందన్నారు. ఎంఆర్ఎన్ఎ టెక్నాలజీతో తయారైన ఈ వ్యాక్సిన్లను వేసుకున్నవారిలో గుండె కణాల్లో వాపును గుర్తించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆస్ట్రాజెనికా, జాన్సన్ టీకాలతో ఆ సమస్య లేదని స్పష్టం చేశారు.
This post was last modified on July 10, 2021 3:41 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…