Political News

కేసీయార్ ఎవరికి భయపడుతున్నారు ?

‘బీజేపీ అంటే కేసీయార్ కి వణుకు మొదలైపోయింది’ ..బండి సంజయ్

‘కాంగ్రెస్ పార్టీని చూడగానే కేసీయార్ కి చెమటలు పడుతున్నాయ్’..రేవంత్

పై రెండు ప్రకటనలు కూడా కాస్త విచిత్రంగానే ఉన్నాయి. తమను చూడగానే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అధినేతలు ఎవరికి వారుగా చెప్పేసుకుంటున్నారు. అసలింతకీ వీళ్ళద్దరికీ కేసీయార్ ఎందుకు భయపడాలి ? కేసీయార్ నే భయపెట్టేంత సీన్ పై ఇద్దరు నేతలకు ఉందా ? ఇఫుడిదే ప్రశ్న రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది.

నిజానికి తెలంగాణా రాజకీయ పార్టీల్లోని ఏ నేతకు కూడా కేసీయార్ ను భయపట్టేంత సీన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ లోని చాలామంది నేతలను తీసుకుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త పట్టుంది. జిల్లా వ్యాప్తంగా పట్టున్న నేతల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపధ్యంలో తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకుని కేసీయార్ తమకు భయపడిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక బీజేపీ నేతల సంగతి చాలా విచిత్రంగా ఉంటుంది. కమలం నేతల్లో చాలామందికి తమ నియోజకవర్గాల్లోనే పట్టులేదు. ఇపుడు బీజేపీకి అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ మొన్నటి ఎంపి ఎన్నికల్లో గెలిచేంతవరకు బయట జనాల్లో చాలా మందికి అసలు తెలీనే తెలీదు. కాకపోతే అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మంచి దూకుడుమీద ఉండటంతో జనాల్లో పాపులర్ అయ్యారంతే.

ఇంతోటిదానికి తామంటేనే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇద్దరు అధ్యక్షులు ఇచ్చుకుంటున్న బిల్డప్ చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ లోని నేతలంతా కలిసికట్టుగా కేసీయార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడినపుడు మాత్రమే టీఆర్ఎస్ కు ఇబ్బందులు మొదలవుతాయి. కానీ ఆపని ఎప్పుడు జరగాలి. ఇక కొత్తగా షర్మిల పెట్టిన పార్టీ అంటారా నాలుగు రోజులు పోతేగాని ఎలాగుంటుందో తెలీదు. కాబట్టి వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on July 10, 2021 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

42 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago