Political News

కేసీయార్ ఎవరికి భయపడుతున్నారు ?

‘బీజేపీ అంటే కేసీయార్ కి వణుకు మొదలైపోయింది’ ..బండి సంజయ్

‘కాంగ్రెస్ పార్టీని చూడగానే కేసీయార్ కి చెమటలు పడుతున్నాయ్’..రేవంత్

పై రెండు ప్రకటనలు కూడా కాస్త విచిత్రంగానే ఉన్నాయి. తమను చూడగానే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అధినేతలు ఎవరికి వారుగా చెప్పేసుకుంటున్నారు. అసలింతకీ వీళ్ళద్దరికీ కేసీయార్ ఎందుకు భయపడాలి ? కేసీయార్ నే భయపెట్టేంత సీన్ పై ఇద్దరు నేతలకు ఉందా ? ఇఫుడిదే ప్రశ్న రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది.

నిజానికి తెలంగాణా రాజకీయ పార్టీల్లోని ఏ నేతకు కూడా కేసీయార్ ను భయపట్టేంత సీన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ లోని చాలామంది నేతలను తీసుకుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త పట్టుంది. జిల్లా వ్యాప్తంగా పట్టున్న నేతల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపధ్యంలో తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకుని కేసీయార్ తమకు భయపడిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక బీజేపీ నేతల సంగతి చాలా విచిత్రంగా ఉంటుంది. కమలం నేతల్లో చాలామందికి తమ నియోజకవర్గాల్లోనే పట్టులేదు. ఇపుడు బీజేపీకి అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ మొన్నటి ఎంపి ఎన్నికల్లో గెలిచేంతవరకు బయట జనాల్లో చాలా మందికి అసలు తెలీనే తెలీదు. కాకపోతే అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మంచి దూకుడుమీద ఉండటంతో జనాల్లో పాపులర్ అయ్యారంతే.

ఇంతోటిదానికి తామంటేనే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇద్దరు అధ్యక్షులు ఇచ్చుకుంటున్న బిల్డప్ చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ లోని నేతలంతా కలిసికట్టుగా కేసీయార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడినపుడు మాత్రమే టీఆర్ఎస్ కు ఇబ్బందులు మొదలవుతాయి. కానీ ఆపని ఎప్పుడు జరగాలి. ఇక కొత్తగా షర్మిల పెట్టిన పార్టీ అంటారా నాలుగు రోజులు పోతేగాని ఎలాగుంటుందో తెలీదు. కాబట్టి వెయిట్ చేయాల్సిందే.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

2 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

2 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

2 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

5 hours ago