తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన వెంటనే ఇటు టీఆర్ఎస్ వాళ్లు.. అటు కాంగ్రెస్లో రేవంత్ శత్రువులు.. ఇటు ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే వైసీపీ వాళ్లు.. చివరకు తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల ఇలా అందరూ ఒక్కటే డైలాగ్ కామన్గా అందుకున్నారు. టీ పీసీసీ కాదు టీటీడీపీ అని.. ! చివరకు కోమటిరెడ్డి అయితే ఓటుకు నోటుతో ఎలా ఓటు కొనాలని చూశాడో… అలాగే డబ్బుతో పీసీసీ కొనుక్కున్నాడని విమర్శించారు. సరే ఇదిలా ఉంటే ఈ రోజు చిట్చాట్లో రేవంత్ టీపీసీసీని టీ టీడీపీ అన్న వాళ్లకు, అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్కు అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు.
నాపై విమర్శలు చేసేందుకు బావ, బావమరుదులు అయిన కేటీఆర్, హరీష్రావు పోటీ పడుతున్నారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ఎల్.రమణను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
కేటీఆర్కు పౌరుషం ఉంటే ఆంధ్రా నాయకుడు రామారావు పేరు మార్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పేరును కేడీఆర్ అని మార్చిన రేవంత్ దానర్థం కల్వకుంట్ల డ్రామారావు అని చెప్పారు. ఇక కేసీఆర్, కేటీఆర్ల బతుకు అంతా తెలుగుదేశం అయితే… హరీష్రావు బతుకు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
టీ కాంగ్రెస్ టీడీపీ అయితే.. టీఆర్ఎస్ కూడా టీడీపీనే కదా ? అని రేవంత్ లాజిక్ చెప్పారు. ఇక కేసీఆర్ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 75 శాతం తెలుగుదేశం వాళ్లు అయితే… కొందరు కాంగ్రెస్ మంత్రులు లేరా ? అని రేవంత్ ప్రశ్నించారు. వాళ్ల నాన్న ముఖ్యమంత్రి పదవి ఇవ్వట్లేదనే కేటీఆర్ బాధపడుతున్నారని… హరీష్ కు 2004లో కాంగ్రెస్ రాజకీయ బిక్ష పెడితే.. 2009లో కేటీఆర్కు తెలుగుదేశం రాజకీయ బిక్ష పెట్టిందని రేవంత్ చెప్పారు.
This post was last modified on July 10, 2021 10:05 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…