Political News

ఫేక్ కరోనా సర్టిఫికెట్ తో టోకరా.. అఖిల ప్రియ భర్తపై మరో కేసు

మాజీ మంత్రి అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆమె భర్త కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదైంది.

నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో భార్గవ్‌ రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్‌, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది.

అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి భార్గవ్ రామ్ సర్టిఫికెట్ అందించారు. ఈనెల 1న ఆయన నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించినట్లు భార్గవ్ రామ్‌పై అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు.

అయితే కొవిడ్‌ సర్టిఫికెట్లను బోయిన్‌పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఆస్పత్రిలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్‌, రత్నాకర్‌, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.

This post was last modified on July 7, 2021 12:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

1 hour ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

1 hour ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

3 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

4 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

9 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

10 hours ago