మాజీ మంత్రి అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆమె భర్త కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదైంది.
నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో భార్గవ్ రామ్తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది.
అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి భార్గవ్ రామ్ సర్టిఫికెట్ అందించారు. ఈనెల 1న ఆయన నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు భార్గవ్ రామ్పై అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు.
అయితే కొవిడ్ సర్టిఫికెట్లను బోయిన్పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్ ఇచ్చిన ఆస్పత్రిలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్, రత్నాకర్, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.
This post was last modified on July 7, 2021 12:27 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…