మాజీ మంత్రి అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆమె భర్త కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదైంది.
నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో భార్గవ్ రామ్తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది.
అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి భార్గవ్ రామ్ సర్టిఫికెట్ అందించారు. ఈనెల 1న ఆయన నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు భార్గవ్ రామ్పై అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు.
అయితే కొవిడ్ సర్టిఫికెట్లను బోయిన్పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్ ఇచ్చిన ఆస్పత్రిలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్, రత్నాకర్, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.
This post was last modified on July 7, 2021 12:27 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…