Political News

టీవీ5 మూర్తి.. అది నిజం కాదు


తెలుగులో మంచి పేరున్న పాత్రికేయుల్లో మూర్తి పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రతి టీవీ ఛానెల్ కూడా యాజమాన్యం ఉద్దేశాలకు తగ్గట్లే పని చేస్తుంది. అందులో ప్రైమ్ ప్రోగ్రాంలను నిర్వహించే జర్నలిస్టులు కూడా యాజమాన్యం చెప్పినట్లే నడుచుకుంటారు. కాకపోతే మూర్తి మాత్రం మరీ ఏకపక్షంగా చర్చా కార్యక్రమాలను నిర్వహించరని.. సమతూకం పాటిస్తారని.. సమాజంలో జరిగే అన్యాయాలని ప్రశ్నిస్తారని పేరుంది. ఆయన కార్యక్రమాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది.

సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న మూర్తి దాదాపు దశాబ్దంన్నరగా టీవీ5లో కొనసాగుతున్నారు. ఆయనను అందరూ టీవీ5 మూర్తి అని పిలుస్తారన్న సంగతీ తెలిసిందే. ఐతే ఈ మధ్య యాజమాన్యంతో మూర్తికి గొడవ జరిగిందని.. ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని.. టీవీ5కు రాజీనామా చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పది రోజులకు పైగా టీవీ5లో మూర్తి కనిపించకపోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. మూర్తి జర్నలిజం వదిలేశారని.. తన ఊరికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. మూర్తి నుంచి స్పందన లేకపోవడంతో ఈ ప్రచారమే నిజమే అనుకున్నారంతా. ఐతే మూర్తి ఇప్పుడు లైన్లోకి వచ్చారు. మళ్లీ టీవీ5లో కనిపించారు. తన గురించి జరిగిన ప్రచారంపై ఆయన టీవీ ద్వారానే స్పందించారు.

తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుందని.. ఒక బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తనపై పడిందని.. అందుకే టీవీ5 ఛైర్మన్ అనుమతితో తాను పది రోజులు సెలవు తీసుకున్నానని.. అంతే తప్ప తాను జర్నలిజం వదిలేసి వ్యవసాయం చేస్తున్నానని ప్రచారం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలని.. కానీ తనకు సెంటు భూమి కూడా లేదని.. భూమి కొనుక్కునే ఆర్థిక స్థోమత కూడా లేదని మూర్తి తెలిపారు. ఇక రాజకీయ ఒత్తిళ్ల విషయానికి వస్తే అవి ఎప్పుడూ ఉండేవే అని.. వాటికి తాను ఎప్పుడూ భయపడలేదని తేల్చి చెప్పారు మూర్తి.

This post was last modified on July 7, 2021 7:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

5 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

6 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

6 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

7 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

8 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

8 hours ago