తెలుగులో మంచి పేరున్న పాత్రికేయుల్లో మూర్తి పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రతి టీవీ ఛానెల్ కూడా యాజమాన్యం ఉద్దేశాలకు తగ్గట్లే పని చేస్తుంది. అందులో ప్రైమ్ ప్రోగ్రాంలను నిర్వహించే జర్నలిస్టులు కూడా యాజమాన్యం చెప్పినట్లే నడుచుకుంటారు. కాకపోతే మూర్తి మాత్రం మరీ ఏకపక్షంగా చర్చా కార్యక్రమాలను నిర్వహించరని.. సమతూకం పాటిస్తారని.. సమాజంలో జరిగే అన్యాయాలని ప్రశ్నిస్తారని పేరుంది. ఆయన కార్యక్రమాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది.
సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న మూర్తి దాదాపు దశాబ్దంన్నరగా టీవీ5లో కొనసాగుతున్నారు. ఆయనను అందరూ టీవీ5 మూర్తి అని పిలుస్తారన్న సంగతీ తెలిసిందే. ఐతే ఈ మధ్య యాజమాన్యంతో మూర్తికి గొడవ జరిగిందని.. ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని.. టీవీ5కు రాజీనామా చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
పది రోజులకు పైగా టీవీ5లో మూర్తి కనిపించకపోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. మూర్తి జర్నలిజం వదిలేశారని.. తన ఊరికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. మూర్తి నుంచి స్పందన లేకపోవడంతో ఈ ప్రచారమే నిజమే అనుకున్నారంతా. ఐతే మూర్తి ఇప్పుడు లైన్లోకి వచ్చారు. మళ్లీ టీవీ5లో కనిపించారు. తన గురించి జరిగిన ప్రచారంపై ఆయన టీవీ ద్వారానే స్పందించారు.
తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుందని.. ఒక బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తనపై పడిందని.. అందుకే టీవీ5 ఛైర్మన్ అనుమతితో తాను పది రోజులు సెలవు తీసుకున్నానని.. అంతే తప్ప తాను జర్నలిజం వదిలేసి వ్యవసాయం చేస్తున్నానని ప్రచారం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలని.. కానీ తనకు సెంటు భూమి కూడా లేదని.. భూమి కొనుక్కునే ఆర్థిక స్థోమత కూడా లేదని మూర్తి తెలిపారు. ఇక రాజకీయ ఒత్తిళ్ల విషయానికి వస్తే అవి ఎప్పుడూ ఉండేవే అని.. వాటికి తాను ఎప్పుడూ భయపడలేదని తేల్చి చెప్పారు మూర్తి.
This post was last modified on July 7, 2021 7:27 am
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…