Political News

టీఆర్ఎస్‌కు మాజీ మంత్రి గుడ్ బై.. రేవంత్‌తో స‌యోధ్య?

టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ లో ఎంతో మంది నేతలు ఎన్నో ఆశలతో పార్టీలో చేరినా ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఈ లిస్టులోనే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మహేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎటు తేల్చుకోలేక సంకట స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా మ‌హేంద‌ర్ రెడ్డి సోద‌రుడు న‌రేంద‌ర్ రెడ్డే కొడంగ‌ల్‌లో రేవంత్‌రెడ్డిపై గెలిచారు.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో తాండూరులో మ‌హేంద‌ర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ నేత ఫైలెట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ కారెక్కించేసుకున్నారు. కేసీఆర్ తొలి ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజ‌కీయాల‌ను త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా శాసించారు. అప్ప‌ట్లో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డితో మ‌హేంద‌ర్ రెడ్డికి పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. ఈ క్ర‌మంలోనే విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మ‌హేంద‌ర్ రెడ్డిని ఓడించారు. అయితే మ‌హేంద‌ర్ రెడ్డి పై గెలిచిన రోహిత్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరిపోవ‌డంతో పాటు కేటీఆర్‌కు అత్యంత క్లోజ్ అయిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాండూరులో రోహిత్‌రెడ్డిని క‌దిపే ప్ర‌శ‌క్తే లేదు.

దీంతో ఇంత సీనియార్టీ ఉండి కూడా మ‌హేంద‌ర్‌రెడ్డికి ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం అంటూ లేకుండా పోయింది. పైగా గ్రేట‌ర్ ప‌రిధిలోని ప‌టాన్‌చెర్వు, శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల మీద దృష్టిపెడుతున్నా అక్క‌డ ఎమ్మెల్యేలు మ‌హేంద‌ర్‌ను రానివ్వ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మ‌హేంద‌ర్ రెడ్డి ఇప్పుడు రాజ‌కీయంగా స‌రికొత్త ఆలోచ‌న చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయన త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం రేవంత్‌తో ఉన్న విబేధాలు ప‌క్క‌న పెట్టి రేవంత్‌తో చేతులు క‌లుపుతార‌ని అంటున్నారు. తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి పార్టీ మారినా కూడా కేడ‌ర్ చెక్కు చెద‌ర్లేదు.

ఇప్పుడు మ‌హేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వ‌స్తే అక్క‌డ కాంగ్రెస్ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతాడు. ఈ క్ర‌మంలోనే మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు కొడంగ‌ల్ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డి కూడా అన్న వెంటే న‌డిచినా .. అప్పుడు కొండ‌గ‌ల్లో రేవంత్‌, తాండూరులో మ‌హేంద‌ర్ రెడ్డి పోటీ చేస్తార‌ట‌. న‌రేంద‌ర్ రెడ్డికి మ‌రో సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on July 6, 2021 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

2 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago