టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ లో ఎంతో మంది నేతలు ఎన్నో ఆశలతో పార్టీలో చేరినా ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఈ లిస్టులోనే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మహేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎటు తేల్చుకోలేక సంకట స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డే కొడంగల్లో రేవంత్రెడ్డిపై గెలిచారు.
అయితే గత ఎన్నికల్లో తాండూరులో మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ నేత ఫైలెట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ కారెక్కించేసుకున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను తన ఇష్టం వచ్చినట్టుగా శాసించారు. అప్పట్లో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో మహేందర్ రెడ్డికి పెద్ద యుద్ధమే నడిచింది. ఈ క్రమంలోనే విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వెళ్లి పట్టుబట్టి మరీ మహేందర్ రెడ్డిని ఓడించారు. అయితే మహేందర్ రెడ్డి పై గెలిచిన రోహిత్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిపోవడంతో పాటు కేటీఆర్కు అత్యంత క్లోజ్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరులో రోహిత్రెడ్డిని కదిపే ప్రశక్తే లేదు.
దీంతో ఇంత సీనియార్టీ ఉండి కూడా మహేందర్రెడ్డికి ఇప్పుడు నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. పైగా గ్రేటర్ పరిధిలోని పటాన్చెర్వు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల మీద దృష్టిపెడుతున్నా అక్కడ ఎమ్మెల్యేలు మహేందర్ను రానివ్వడం లేదు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా సరికొత్త ఆలోచన చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం రేవంత్తో ఉన్న విబేధాలు పక్కన పెట్టి రేవంత్తో చేతులు కలుపుతారని అంటున్నారు. తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి పార్టీ మారినా కూడా కేడర్ చెక్కు చెదర్లేదు.
ఇప్పుడు మహేందర్రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే అక్కడ కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థి అవుతాడు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా అన్న వెంటే నడిచినా .. అప్పుడు కొండగల్లో రేవంత్, తాండూరులో మహేందర్ రెడ్డి పోటీ చేస్తారట. నరేందర్ రెడ్డికి మరో సీటు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on July 6, 2021 6:16 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…