ఏపీ కేబినెట్ ప్రక్షాళన విషయంపై సీఎం జగన్ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు అందలేదు. కానీ, కేబినెట్లో సీటు దక్కించుకు నేందుకు మాత్రం నేతలు పరుగులు పెడుతున్నారు. ఒకరిని మించి మరొకరు మంత్రి వర్గంలో స్థానం కోసం కుస్తీలు పడుతున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు కృష్ణాజిల్లా నుంచి ఒకరి పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే. ఆయనకు విప్ హోదా ఇవ్వడంతోపాటు టీటీడీ బోర్డు పదవి కూడా ఇచ్చారు.
అయితే.. త్వరలోనే జరుగుతుందని భావిస్తున్న కేబినెట్ విస్తరణపై కొలుసు పార్థసారథి భారీగానే ఆశలు పెట్టున్నారు. బీసీ కోటాలో అయినా.. తనకు ఖచ్చితంగా దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే బీసీ యాదవ కోటాలో అనిల్ను కొనసాగించే ఛాన్సులు ఉన్నాయి. అదే జరిగితే పార్థసారథికి మంత్రి పదవి ఖచ్చితంగా దక్కదు. ఇదిలావుంటే, ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి మరో ఇద్దరి పేర్లు తెరమీదికి వచ్చాయి. వీరిలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు భారీగా వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో ఫైర్ బ్రాండ్ నేతగా ఆయన గుర్తింపు కోసం పాకులాడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు.. పార్టీ విషయంలోనూ ఆయన దూకుడుగా ఉన్నారు. ఈ క్రమంలో తనకు జగన్ మంచి ఛాన్స్ ఇస్తారని ఆయన చెబుతున్నారు. ఇక, ఇప్పుడు మరో కొత్త పేరు తెరమీదకి వచ్చింది. తెలంగాణలో రాజ్యం అంతా వెలమలదే అన్నట్టుగా ఉంది. అక్కడ సీఎం కేసీఆర్ కాకుండా.. మరో నలుగురు మంత్రులు ఉన్నారు. ఏపీలో ఈ వర్గం నుంచి ఎవ్వరూ మంత్రులు లేరు. చంద్రబాబు ప్రభుత్వంలో సుజయ్ కృష్ణ రంగారావు ఈ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు ఇదే సామాజిక వర్గానికి చెందిన నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు.. కేబినెట్లో తనకు చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తనకు అవకాశం ఇస్తే ఏపీలో వెలమ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెస్తానని ఆయన అంటున్నారు. దీంతో ఈయన కూడా తనవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారని తెలుస్తోంది. మరి ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రుల్లో జగన్ ఎవరిని తప్పించి… కొత్తగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో ? చూడాలి.
This post was last modified on July 7, 2021 2:57 pm
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…