మాండ్య ఎంపీ, నటి సుమలత పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నోరు జారారు. కావేరీ నదిపై కృష్ణసాగరాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీకు అవుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. గత కొంతకాలంగా.. సుమలత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కుమార స్వామి స్పందించారు.
జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే… అడ్డుగా… ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ.. కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మైసూరు చక్కెర కర్మాగారం అంశంపై జేడీ (ఎస్) ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కేఆర్ఎస్ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచూ ఆరోపిస్తున్నారని అన్నారు. జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని మాజీ సీఎం ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు.
‘ఆమె లాంటి ఎంపీని మాండ్యా ఎప్పుడూ చూసి ఉండదు.. భవిష్యత్తులో ఆమె లాంటి వారు.. ఆమె సానుభూతితో గెలిచారు.. ఆమెకు మరో అవకాశం రాదు కాబట్టి ఆమె సరిగ్గా పనిచేస్తే మంచిది’ అని వ్యాఖ్యానించారు.
మాండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత.. కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ అక్కసుతోనే కుమారస్వామి ఇలా మాట్లాడాడంటూ విమర్శలు కూడా వినపడుతున్నాయి. మరి తన మాటలను ఆయన వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి.
This post was last modified on July 6, 2021 2:13 pm
ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…
దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…
కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు, గ్యాస్ సమస్యలతో ఇరకాటంలో పడ్డాయి. అనేక దేశాల్లో మారకం…