Political News

సుమలతను పడుకోబెట్టాలంటూ.. నోరు జారిన మాజీ సీఎం..!

మాండ్య ఎంపీ, నటి సుమలత పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నోరు జారారు. కావేరీ నదిపై కృష్ణసాగరాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీకు అవుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. గత కొంతకాలంగా.. సుమలత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కుమార స్వామి స్పందించారు.

జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే… అడ్డుగా… ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ.. కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మైసూరు చక్కెర కర్మాగారం అంశంపై జేడీ (ఎస్) ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచూ ఆరోపిస్తున్నారని అన్నారు. జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని మాజీ సీఎం ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు.

‘ఆమె లాంటి ఎంపీని మాండ్యా ఎప్పుడూ చూసి ఉండదు.. భవిష్యత్తులో ఆమె లాంటి వారు.. ఆమె సానుభూతితో గెలిచారు.. ఆమెకు మరో అవకాశం రాదు కాబట్టి ఆమె సరిగ్గా పనిచేస్తే మంచిది’ అని వ్యాఖ్యానించారు.

మాండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత.. కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ అక్కసుతోనే కుమారస్వామి ఇలా మాట్లాడాడంటూ విమర్శలు కూడా వినపడుతున్నాయి. మరి తన మాటలను ఆయన వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి.

This post was last modified on July 6, 2021 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago