మాండ్య ఎంపీ, నటి సుమలత పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నోరు జారారు. కావేరీ నదిపై కృష్ణసాగరాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీకు అవుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. గత కొంతకాలంగా.. సుమలత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కుమార స్వామి స్పందించారు.
జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే… అడ్డుగా… ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ.. కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మైసూరు చక్కెర కర్మాగారం అంశంపై జేడీ (ఎస్) ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కేఆర్ఎస్ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచూ ఆరోపిస్తున్నారని అన్నారు. జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని మాజీ సీఎం ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు.
‘ఆమె లాంటి ఎంపీని మాండ్యా ఎప్పుడూ చూసి ఉండదు.. భవిష్యత్తులో ఆమె లాంటి వారు.. ఆమె సానుభూతితో గెలిచారు.. ఆమెకు మరో అవకాశం రాదు కాబట్టి ఆమె సరిగ్గా పనిచేస్తే మంచిది’ అని వ్యాఖ్యానించారు.
మాండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత.. కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ అక్కసుతోనే కుమారస్వామి ఇలా మాట్లాడాడంటూ విమర్శలు కూడా వినపడుతున్నాయి. మరి తన మాటలను ఆయన వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి.
This post was last modified on July 6, 2021 2:13 pm
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…