గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్, అప్పుడు టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేసిన విషయం తెలిసిందే. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. ఇక ఆ పాదయాత్ర ద్వారానే జగన్ ప్రజలకు దగ్గరయ్యారు. అప్పుడు ఏ సమస్య ఉన్న జగన్ అన్న ఉన్నారనే విధంగా రాజకీయం నడిచింది. జగన్ అన్న అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తొలగిపోతాయి అనేలాగా వైసీపీ కార్యకర్తలుగానీ, నేతలుగానీ ప్రచారం చేశారు. జగన్ సైతం ప్రజల చేత అన్న అని పిలిపించుకుని వారికి మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేశారు.
అలా దగ్గరవ్వడం వల్లే గత ఎన్నికల్లో జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇలా గెలిచిన జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందిస్తున్నారు. ఇక ఇందులో ‘జగనన్న’ అనే ట్యాగ్ అని వదలడం లేదు. చాలా పథకాలకు జగనన్న అనే పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా జగనన్న పేరుతో జగన్ బాగానే సక్సెస్ అయ్యారు. అయితే ఇదే సక్సెస్ ఫార్ములాని లోకేష్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
గతంలో కంటే లోకేష్ వైఖరి ఇప్పుడు చాలా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడుతున్నారు. ఎలాంటి తడబాటు లేకుండా స్పీచ్లు ఇస్తున్నారు. ఆఖరికి బాడీ లాంగ్వేజ్ కూడా మార్చారు. ఇలా మారిన లోకేష్, ప్రజల సమస్యలపై కూడా బాగానే పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్ధుల తరుపున గట్టిగా పోరాడారు. విద్యార్ధుల చేత అన్న అని పిలిపించుకుంటూ ముందుకెళ్లారు.
అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పరీక్షలని రద్దు చేసింది. సుప్రీం తీర్పుతో వెనక్కి తగ్గినా సరే, ఈ విషయంలో లోకేష్కు కాస్త ప్లస్ అయింది. పరీక్షలు రద్దు అయ్యాక టీడీపీ నాయకులు, కార్యకర్తలు థాంక్యూ లోకేష్ అన్న పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అంటే లోకేష్ సైతం అన్న అనే బ్రాండ్ని తగిలించుకున్నారు. అంటే ప్రజలకు ఏ సమస్య ఉన్న లోకేష్ అన్న ఉన్నాడనే విధంగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. మరి ఈ అన్న అనే ట్యాగ్ లోకేష్కు ఏ మేర సక్సెస్ తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on July 5, 2021 9:38 am
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…