Political News

షర్మిలను వదిలేసిన రోజా

అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రోజా చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. రావటం రావటమే ఒకేసారి ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణా ప్రభుత్వంపై ఫుల్లుగా ఫైరయ్యారు. మంగరళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేసిన దీక్షపై రోజా మండిపోయారు. దొంగ దీక్షలు చేయటం వల్ల చంద్రబాబు జనాల్లో పలుచనైపోయారంటు సెటైర్లు వేశారు.

ఇక తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల వివాదంపైన కూడా రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణా మంత్రులను తప్పుపట్టారు. వైఎస్సార్ ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటు మంత్రులకు గట్టి వార్నింగే ఇచ్చారు. ప్రాజెక్టుల నుండి అక్రమంగా నీటిని వాడేస్తు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం తగదన్నారు. రోజా తెలంగాణ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం మాట అటుంచుందాం.

దివంగత సీఎం వైఎస్సార్ గురించి తెలంగాణా మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చేట్లుగా వైఎస్ షర్మిల కూడా మాట్లాడారు కదా. మరి షర్మిల గురించి రోజా ఏమి మాట్లాడకపొవటం బాగోలేదు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన రోజా షర్మిల గురించి కూడా ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. వైఎస్ కూతురు షర్మిలే నీటి వాడకం విషయంలో ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన తర్వాత ఇక రోజా మాట్లాడేందుకు ఏముంటుంది ?

అయినా జల వివాదాల గురించి రోజా మాట్లాడటం అనవసరమే. ఎందుకంటే ప్రస్తుత వివాదంపై జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖలు రాశారు. నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతున్నారు. వీరికి అవసరమైన సమాచారం ఇవ్వటానికి ఉన్నతాధికారులు ఎలాగూఉన్నారు. ఇక రోజా వార్నింగులు, విజ్ఞప్తులతో పనేముంది ?

This post was last modified on July 3, 2021 11:22 am

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

6 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago