అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రోజా చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. రావటం రావటమే ఒకేసారి ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణా ప్రభుత్వంపై ఫుల్లుగా ఫైరయ్యారు. మంగరళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేసిన దీక్షపై రోజా మండిపోయారు. దొంగ దీక్షలు చేయటం వల్ల చంద్రబాబు జనాల్లో పలుచనైపోయారంటు సెటైర్లు వేశారు.
ఇక తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల వివాదంపైన కూడా రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణా మంత్రులను తప్పుపట్టారు. వైఎస్సార్ ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటు మంత్రులకు గట్టి వార్నింగే ఇచ్చారు. ప్రాజెక్టుల నుండి అక్రమంగా నీటిని వాడేస్తు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం తగదన్నారు. రోజా తెలంగాణ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం మాట అటుంచుందాం.
దివంగత సీఎం వైఎస్సార్ గురించి తెలంగాణా మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చేట్లుగా వైఎస్ షర్మిల కూడా మాట్లాడారు కదా. మరి షర్మిల గురించి రోజా ఏమి మాట్లాడకపొవటం బాగోలేదు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన రోజా షర్మిల గురించి కూడా ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. వైఎస్ కూతురు షర్మిలే నీటి వాడకం విషయంలో ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన తర్వాత ఇక రోజా మాట్లాడేందుకు ఏముంటుంది ?
అయినా జల వివాదాల గురించి రోజా మాట్లాడటం అనవసరమే. ఎందుకంటే ప్రస్తుత వివాదంపై జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖలు రాశారు. నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతున్నారు. వీరికి అవసరమైన సమాచారం ఇవ్వటానికి ఉన్నతాధికారులు ఎలాగూఉన్నారు. ఇక రోజా వార్నింగులు, విజ్ఞప్తులతో పనేముంది ?
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…