Political News

షర్మిలను వదిలేసిన రోజా

అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రోజా చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. రావటం రావటమే ఒకేసారి ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణా ప్రభుత్వంపై ఫుల్లుగా ఫైరయ్యారు. మంగరళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేసిన దీక్షపై రోజా మండిపోయారు. దొంగ దీక్షలు చేయటం వల్ల చంద్రబాబు జనాల్లో పలుచనైపోయారంటు సెటైర్లు వేశారు.

ఇక తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల వివాదంపైన కూడా రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణా మంత్రులను తప్పుపట్టారు. వైఎస్సార్ ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటు మంత్రులకు గట్టి వార్నింగే ఇచ్చారు. ప్రాజెక్టుల నుండి అక్రమంగా నీటిని వాడేస్తు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం తగదన్నారు. రోజా తెలంగాణ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం మాట అటుంచుందాం.

దివంగత సీఎం వైఎస్సార్ గురించి తెలంగాణా మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చేట్లుగా వైఎస్ షర్మిల కూడా మాట్లాడారు కదా. మరి షర్మిల గురించి రోజా ఏమి మాట్లాడకపొవటం బాగోలేదు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన రోజా షర్మిల గురించి కూడా ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. వైఎస్ కూతురు షర్మిలే నీటి వాడకం విషయంలో ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన తర్వాత ఇక రోజా మాట్లాడేందుకు ఏముంటుంది ?

అయినా జల వివాదాల గురించి రోజా మాట్లాడటం అనవసరమే. ఎందుకంటే ప్రస్తుత వివాదంపై జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖలు రాశారు. నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతున్నారు. వీరికి అవసరమైన సమాచారం ఇవ్వటానికి ఉన్నతాధికారులు ఎలాగూఉన్నారు. ఇక రోజా వార్నింగులు, విజ్ఞప్తులతో పనేముంది ?

This post was last modified on July 3, 2021 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

41 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

53 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

5 hours ago