అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రోజా చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. రావటం రావటమే ఒకేసారి ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణా ప్రభుత్వంపై ఫుల్లుగా ఫైరయ్యారు. మంగరళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేసిన దీక్షపై రోజా మండిపోయారు. దొంగ దీక్షలు చేయటం వల్ల చంద్రబాబు జనాల్లో పలుచనైపోయారంటు సెటైర్లు వేశారు.
ఇక తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల వివాదంపైన కూడా రోజా ఫైర్ అయ్యారు. తెలంగాణా మంత్రులను తప్పుపట్టారు. వైఎస్సార్ ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటు మంత్రులకు గట్టి వార్నింగే ఇచ్చారు. ప్రాజెక్టుల నుండి అక్రమంగా నీటిని వాడేస్తు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం తగదన్నారు. రోజా తెలంగాణ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం మాట అటుంచుందాం.
దివంగత సీఎం వైఎస్సార్ గురించి తెలంగాణా మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చేట్లుగా వైఎస్ షర్మిల కూడా మాట్లాడారు కదా. మరి షర్మిల గురించి రోజా ఏమి మాట్లాడకపొవటం బాగోలేదు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన రోజా షర్మిల గురించి కూడా ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. వైఎస్ కూతురు షర్మిలే నీటి వాడకం విషయంలో ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన తర్వాత ఇక రోజా మాట్లాడేందుకు ఏముంటుంది ?
అయినా జల వివాదాల గురించి రోజా మాట్లాడటం అనవసరమే. ఎందుకంటే ప్రస్తుత వివాదంపై జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖలు రాశారు. నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతున్నారు. వీరికి అవసరమైన సమాచారం ఇవ్వటానికి ఉన్నతాధికారులు ఎలాగూఉన్నారు. ఇక రోజా వార్నింగులు, విజ్ఞప్తులతో పనేముంది ?
This post was last modified on July 3, 2021 11:22 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…