Political News

రేవంత్ ముందు జాగ్రత్త

కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగానే నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే నూరుశాతం ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడిని తిడతారు, జాతీయ అధ్యక్షురాలిపై నోటికొచ్చింది మాట్లాడేస్తారు. మళ్ళీ ఎన్నికల్లో టికెట్ తెచ్చేసుకుంటారు. కోపం వచ్చినపుడు తిట్టేయటం, ఆరోపణలు చేసేయటం మళ్ళీ టికెట్ తెచ్చేసుకోవటం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సహజం. అందుకనే పార్టీ నుండి నేతలెవరినీ అధిష్టానం బయటకు పంపేయటం చాలా చాలా తక్కువనే చెప్పాలి.

ఇటువంటి వ్యక్తిస్వేచ్చ అపరిమితంగా ఉన్న పార్టీకి జూనియర్ మోస్ట్ నేత రేవంత్ అధ్యక్షుడయ్యారు. దాంతో సహజంగానే పార్టీలో అసంతృప్తులు బయలుదేరాయి. బహుశా ఈ విషయం గమనించే రేవంత్ కూడా కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సీనియర్ నేత వీ హనుమంతరావును కలిసొచ్చారు. అలాగే మరి కొందరు నేతల ఇళ్ళకు వెళ్ళి వాళ్ళతో భేటీ అయ్యారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతు పార్టీలో తనకన్నా సీనియర్లు, అనుభవజ్ఞులు చాలామందున్నా పీసీసీ పగ్గాలు తనకు అప్పగించినట్లు అంగీకరించారు. కాంగ్రెస్, టీడీపీ నుండి టీఆర్ఎస్ లో జాయిన అయిన నేతలతో మాట్లాడుతానని స్పష్టంచేశారు. ఘర్ వాపసీ ప్రోగ్రామ్ ను అమలు చేస్తానన్నారు. ఇందుకోసం సీనియర్లతో చర్చించి ప్లాన్ చేస్తానని చెప్పటం గమనార్హం. నిజానికి రేవంత్ తో పాటు చాలామంది సీనియర్లు పీసీసీ పగ్గాల కోసం పోటీపడ్డారు.

అయితే ఎవరికి వాళ్ళుగా పోటీ పడటంతో ఉన్న వాళ్ళల్లో రేవంతే బెటర్ అనుకుని అధిష్టానం పగ్గాలను అప్పగించింది. రేవంత్ కు పోటీగా ఉన్న వాళ్ళంతా ఏకమై ఒకే అభ్యర్ధిని ప్రతిపాదించుంటే కచ్చితంగా సదరు అభ్యర్ధికే పీసీసీ అధ్యక్ష పీఠం దక్కేదనటంలో సందేహంలేదు. ఈ విషయం రేవంత్ కు కూడా బాగా తెలుసు. అందుకనే ప్రతి విషయంలోను సీనియర్లతో చర్చలు జరుపుతానని, సీనియర్లతో కమిటి వేస్తానని చెబుతున్నారు. తనక వ్యతిరేకంగా ఉన్న సీనియర్లను కలుపుకుని పోవటంలో రేవంత్ తెలివిగా వ్యవహిరిస్తున్నట్లే అనిపిస్తోంది.

This post was last modified on July 3, 2021 12:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

6 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

6 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

8 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

10 hours ago