Political News

పోల‌వ‌రం..’ముంపు’ పాపం ఎవ‌రిది?


పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌రిధిలోని 200 గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం గోదావ‌రికి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా.. ఈ ప్రాంతంలో నీరు పోటెత్త‌డంతో.. నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట‌మునిగి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా గోదావ‌రి వ‌రద ఉదృతితో కాఫ‌ర్ డ్యామ్‌కు ఎగ‌ద‌న్నుతున్న నీరు.. వెన‌క్కి మ‌ళ్లి.. గ్రామాల‌ను ముంచేస్తోంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో బాధ‌ప‌డుతున్న‌ది ప్ర‌జ‌లైతే.. మ‌రి పాపం ఎవ‌రిది? ఏ ప్ర‌భుత్వానిది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడు.. స‌హ‌జంగానే పోల‌వ‌రం, దేవీప‌ట్నం.. స‌హా అనేక గ్రామాల‌కు వ‌ర‌ద పోటెత్తేది. అయితే.. ఇప్పుడు కాఫ‌ర్ డ్యామ్ కార‌ణంగా.. ఇది మ‌రింత పెరిగింది.

భద్రాచలం వద్ద ఏటా 48 అడుగుల నీటిమట్టం నమోదయిన పక్షంలోనే తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం కొంతలో కొంత ముంపుకు గురయ్యేది. కానీ నీటిమట్టం అంతగా లేకున్నా ఇప్పుడు దేవీపట్నం వైపు వరద పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద 56 అడుగుల నీటి మట్టం నమోదు అయినప్పుడు కుక్కునూరు, వేలేరుపాడు ముంపు మండలాల్లో దాదాపు 25పైగా గ్రామాలు వరద తాకిడికి గురయ్యేవి. తిరిగి వారంలోపే కుదుటపడేవి. కానీ ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ వల్ల మండల కేంద్రమైన వేలేరుపాడు సమీపాన గోదావరి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీంతో గ్రామాలు మునిగిపోతున్నారు.

ఈ విష‌యం.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాని కంటే కూడా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికే ఎక్కువ‌గా తెలుసు..! ఎందుకంటే.. ఆయ‌నే పోల‌వ‌రంపై ప్ర‌తి సోమ‌వారం స‌మీక్ష‌లు పెట్టి.. సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చుకున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ముంపు బాధితుల‌కు నివాసాలు క‌ట్టించే విష‌యంపై చంద్ర‌బాబు ఏం చేశార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇప్ప‌టికీ నిర్వాశితుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలూ క‌ల్పించ‌లేదు. పైగా.. దీనిపై కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌ను కూడా వ‌దులుకున్నార‌ని.. అంటే.. అంచ‌నాలు పెంచాల్సిన స‌మ‌యంలో నిర్వాశితుల స‌మ‌స్య‌ను.. కేంద్రం వ‌దిలించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. దీనికి చంద్ర‌బాబు ప‌చ్చ‌జెండా ఊపారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. నిర్వాసితుల‌కు గ‌త ప్ర‌భుత్వంలో ఏమీ మిగ‌ల్లేదు.

ఇక‌, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ‌చ్చి రెండేళ్లే అయింది.. అయితే.. కొంత‌మేర‌కు చేసే అవ‌కాశం ఉండ‌డంతో చేశారు. అయితే..కేంద్రం నుంచి వివాదం నెల‌కొన‌డంతో.. వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు తాజాగా.. పోల‌వ‌రం గ్రామాలు వ‌ర‌ద తాకిడికి మునిగిపోయాయి. గిరిజ‌నులు, మ‌త్స్య‌కారులు.. రోడ్డున ప‌డ్డారు. మ‌రి ఇది.. ఎవ‌రి పాపం.? చంద్ర‌బాబుదా? జ‌గ‌న్‌దా? ఎవ‌రిదైనా.. ఇప్పుడు ప్ర‌ధానంగా న‌ష్ట‌పోతోంది మాత్రం జ‌నాలే. మ‌రి ఇప్ప‌టికైనా.. చ‌ర్య‌లు తీసుకుంటారో.. లేదో చూడాలి.

Satya

Recent Posts

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

17 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

3 hours ago