Political News

పోల‌వ‌రం..’ముంపు’ పాపం ఎవ‌రిది?


పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌రిధిలోని 200 గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం గోదావ‌రికి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా.. ఈ ప్రాంతంలో నీరు పోటెత్త‌డంతో.. నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట‌మునిగి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా గోదావ‌రి వ‌రద ఉదృతితో కాఫ‌ర్ డ్యామ్‌కు ఎగ‌ద‌న్నుతున్న నీరు.. వెన‌క్కి మ‌ళ్లి.. గ్రామాల‌ను ముంచేస్తోంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో బాధ‌ప‌డుతున్న‌ది ప్ర‌జ‌లైతే.. మ‌రి పాపం ఎవ‌రిది? ఏ ప్ర‌భుత్వానిది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడు.. స‌హ‌జంగానే పోల‌వ‌రం, దేవీప‌ట్నం.. స‌హా అనేక గ్రామాల‌కు వ‌ర‌ద పోటెత్తేది. అయితే.. ఇప్పుడు కాఫ‌ర్ డ్యామ్ కార‌ణంగా.. ఇది మ‌రింత పెరిగింది.

భద్రాచలం వద్ద ఏటా 48 అడుగుల నీటిమట్టం నమోదయిన పక్షంలోనే తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం కొంతలో కొంత ముంపుకు గురయ్యేది. కానీ నీటిమట్టం అంతగా లేకున్నా ఇప్పుడు దేవీపట్నం వైపు వరద పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద 56 అడుగుల నీటి మట్టం నమోదు అయినప్పుడు కుక్కునూరు, వేలేరుపాడు ముంపు మండలాల్లో దాదాపు 25పైగా గ్రామాలు వరద తాకిడికి గురయ్యేవి. తిరిగి వారంలోపే కుదుటపడేవి. కానీ ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ వల్ల మండల కేంద్రమైన వేలేరుపాడు సమీపాన గోదావరి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీంతో గ్రామాలు మునిగిపోతున్నారు.

ఈ విష‌యం.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాని కంటే కూడా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికే ఎక్కువ‌గా తెలుసు..! ఎందుకంటే.. ఆయ‌నే పోల‌వ‌రంపై ప్ర‌తి సోమ‌వారం స‌మీక్ష‌లు పెట్టి.. సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చుకున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ముంపు బాధితుల‌కు నివాసాలు క‌ట్టించే విష‌యంపై చంద్ర‌బాబు ఏం చేశార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇప్ప‌టికీ నిర్వాశితుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలూ క‌ల్పించ‌లేదు. పైగా.. దీనిపై కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌ను కూడా వ‌దులుకున్నార‌ని.. అంటే.. అంచ‌నాలు పెంచాల్సిన స‌మ‌యంలో నిర్వాశితుల స‌మ‌స్య‌ను.. కేంద్రం వ‌దిలించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. దీనికి చంద్ర‌బాబు ప‌చ్చ‌జెండా ఊపారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. నిర్వాసితుల‌కు గ‌త ప్ర‌భుత్వంలో ఏమీ మిగ‌ల్లేదు.

ఇక‌, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ‌చ్చి రెండేళ్లే అయింది.. అయితే.. కొంత‌మేర‌కు చేసే అవ‌కాశం ఉండ‌డంతో చేశారు. అయితే..కేంద్రం నుంచి వివాదం నెల‌కొన‌డంతో.. వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు తాజాగా.. పోల‌వ‌రం గ్రామాలు వ‌ర‌ద తాకిడికి మునిగిపోయాయి. గిరిజ‌నులు, మ‌త్స్య‌కారులు.. రోడ్డున ప‌డ్డారు. మ‌రి ఇది.. ఎవ‌రి పాపం.? చంద్ర‌బాబుదా? జ‌గ‌న్‌దా? ఎవ‌రిదైనా.. ఇప్పుడు ప్ర‌ధానంగా న‌ష్ట‌పోతోంది మాత్రం జ‌నాలే. మ‌రి ఇప్ప‌టికైనా.. చ‌ర్య‌లు తీసుకుంటారో.. లేదో చూడాలి.

This post was last modified on July 3, 2021 11:06 am

Share
Show comments

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

12 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

40 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago