Political News

సీనియ‌ర్లు లేని కాంగ్రెస్ సామ్రాజ్యం..!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏడేళ్ల కింద‌ట ప‌ట్టిన గ్ర‌హణం ఇప్ప‌టి వ‌ర‌కు విడ‌వ‌లేదు. ఈ పార్టీలో ఒక‌ప్పుడు సీనియ‌ర్లుగా చ‌క్రం తిప్పిన వారు.. చాలా మంది పార్టీ మారిపోయారు. ఇక‌, కొంద‌రు ఏకంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. మిగిలిన వారిలోనూ సీనియ‌ర్లు.. చాలా మంది త‌ట‌స్థంగా ఉంటున్నారే త‌ప్ప పార్టీ వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏ పార్టీకైనా ఒడిదుడుకులు త‌ప్ప‌వు. అలాగ‌ని.. క‌ష్టాలు పూర్తిగా ఉంటాయా ? అంటే.. అది కూడా క‌ష్ట‌మే. ఎందుకంటే.. అస‌లు ఏమీ లేని స్టేజ్ నుంచి టీడీపీ అనేక‌సార్లు విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలోనూ ఈ త‌ర‌హా ప‌రిణామాలు కామ‌నే అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయిన‌ప్ప‌టికీ.. సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా పార్టీ ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇటీవ‌ల పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ ఆస‌క్తిక‌ర విష‌యం తెచ్చారు. ఉన్నవారితోనే పార్టీ ముందుకు న‌డుస్తుంద‌ని, ఆయ‌న నొక్కి వ‌క్కాణించారు. చిరంజీవి పార్టీకి దూరంగా ఉన్నార‌ని.. అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఒకింత అస‌హ‌నంతోనే ఈ స‌మాధానం చెప్పి ఉంటారు. కానీ, ఆయ‌న చెప్పిన‌ట్టే.. ఉన్న‌వారితోనే పార్టీని న‌డిపిస్తామంటే.. ఇప్పుడు ఉన్న‌వారిలో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కులు. ప్ర‌జ‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిన నాయ‌కులు వేళ్ల మీద లెక్కించాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఈ గతంలో.. పార్టీని ప‌రుగులు పెట్టించిన‌, త‌మ‌దైన శైలిలో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న నేత‌లు.. కనుమూరి బాపిరాజు, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, ప‌ల్లంరాజు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, చింతా మోహ‌న్ (గ‌త తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పోటీ చేసినా.. త‌ర్వాత ఎవ‌రితోనూ ఆయ‌న క‌ల‌వ‌డం లేదు), డీఎల్ ర‌వీంద్రారెడ్డి, ర‌ఘువీరారెడ్డి (పార్టీకి దూరంగా ఉంటున్నారు), సుబ్బి రామిరెడ్డి వంటివారు కాంగ్రెస్‌కు అంత్యంత సానుభూతి ప‌రులు. వీరు కూడా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగ‌ని వేరే పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. మ‌రి ఇలాంటి వారిని కూడా దూరం చేసుకుంటే ప‌రిస్థితి ఏంటి.

ఇక‌, కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు, మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఉన్న క‌మిటీలు.. యూత్ కాంగ్రెస్‌, మ‌హిళా కాంగ్రెస్‌.. లు ఏపీలో లేనేలేవు. విచిత్రం ఏంటంటే ఉన్నంత‌లో రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న సుంక‌ర ప‌ద్మ‌శ్రీ మాత్రం ఫైర్‌బ్రాండ్‌గా జ‌గ‌న్, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంత‌కు మించి ఆ పార్టీలో మాట్లాడే వారు ఎవ్వ‌రూ లేరు. మ‌రి ఇలా అయితే.. పార్టీ న‌డిచేనా..? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా.. పార్టీ ఒడ్డుకు చేరేనా ? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కాంగ్రెస్‌లోనే ఉంటూ.. వైసీపీ సానుభూతిప‌రులుగా ప‌నులు చేయించుకునేవారు మ‌రికొంద‌రు ఉన్నారు. మ‌రి వీరి ప‌రిస్థితి ఏంటి ? ఇలా అనేక చిక్కుముళ్లు కాంగ్రెస్‌ను వేధిస్తున్నాయ‌నేది వాస్త‌వం.

This post was last modified on July 3, 2021 7:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

5 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

5 hours ago