జనాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి మంటలెక్కిస్తున్నారు. ఒకవైపు పెట్రోలు, డీజల్ ధరలు పెంచేస్తున్న మోడి సర్కార్ తాజాగా గ్యాస్ బండ ధరను కూడా పెంచేసింది. గోడ దెబ్బ చెంపదెబ్బ లాగ ఒకవైపు ఫ్యూయల్ ధరల పెంపు, మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదల. మొత్తానికి కేంద్రం జనాలను రెండు వైపులా వాయించేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్ కు 100 రూపాయలు దాటిపోయింది. అలాగే డీజల్ లీటర్ ధర వంద రూపాయలకు దగ్గరలో ఉంది.
అంతర్జాతీయ స్ధాయిలో క్రూడాయిల్ ధరలు బాగా తక్కువగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం ఫ్యూయల్ ధరలను తగ్గించటం లేదు. ధరలను తగ్గించటం మాటపక్కన పెట్టేసి ఏరోజుకా రోజు ధరలను పెంచుకుంటుపోతోంది. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలపై చేసిన ఖర్చు మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఇలా ధరలను పెంచుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
పెట్రోలు, డీజల్ ధరల పెంపుపైనే ఏడాదికి కేంద్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇది చాలాదన్నట్లుగా తాజాగా గ్యాస్ ధరను కూడా బాగా పెంచేసింది. ఇళ్ళల్లో వాడుకునే సిలిండర్ల ధర 25 రూపాయలు పెంచిన కేంద్రం వాణిజ్యావసరాలకు వాడే సిలిండర్ల ధరను 84 రూపాయలు పెంచింది. మొత్తానికి మోడి మాత్రం జనాలకు మంటలెక్కిస్తున్నారు.
This post was last modified on July 2, 2021 10:45 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…