అత్యంత కీలకమైన.. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి మేడిపండేనా ? .. ఇక్కడ బలపడ్డాం.. ఇంకేముంది.. టీడీపీ కూసాలు కదిలిపోవడం ఖాయం అని.. వైసీపీ నేతలు భావిస్తే.. భావించి ఉండొచ్చు. కానీ, వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గుంటూరు జిల్లాలో టీడీపీకి మద్దతుదారులు ఎక్కువ. ఇక్కడ నేతలు చాలా మంది వరుసగా విజయాలు సాధించారు. దీంతో .. టీడీపీకి 2014లో ఎక్కవ సీట్లు లభించాయి. అదే సమయంలో రెండు ఎంపీ స్థానాలు కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ దూకుడు ప్రదర్శించింది.
ఈ క్రమంలో ఒక ఎంపీ స్థానం సహా.. ఎమ్మెల్యేలను గెలుచుకుంది. నిజానికి ఒక రకంగా.. గుంటూరులో వైసీపీ ఇంత రేంజ్లో విజయం దక్కించుకోవడం.. రికార్డనే చెప్పాలి. ఎందుకంటే.. టీడీపీ హయాంలో గుంటూరులోని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇక్కడ వంద అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే సమయంలో పెద్ద ఎత్తున రహదారులను కూడా నిర్మించారు. పైగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ. ఇక రాజధాని రియల్ భూమ్ హవాలో ఇక్కడ సామాన్యులు సైతం కుబేరులు అయ్యారు. దీంతో టీడీపీకి మరింత మద్దతు చేకూరి జిల్లా జిల్లా మొత్తం.. కంచుకోటగా మారుతుందని లెక్కలు వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ వైసీపీ పుంజుకుంది.
దీంతో ఇంకేముంది.. టీడీపీకి ఏమీలేదు.. అంతా మాదే.. అంతా మేమే.. అనే తరహాలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. దీంతో నిజంగానే వైసీపీ బలపడిందా? ఇది బలమేనా ? అనే చర్చ సాగుతోంది. అయితే, గడిచిన రెండేళ్లలో ఇక్కడ చేసిన అభివృద్ధి అంటూ లేకపోగా.. నేతలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఒకరిపై ఒకరు ఎంపీ, ఎమ్మెల్యేలు వీధి పోరాటాలకు దిగారు. దీంతో ప్రజాప్రతినిధులు అంటే.. ఉండే విలువను చేజేతులా నాశనం చేసుకున్నట్టయిందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, అత్యంత కీలకమైన.. అమరావతి తరలింపు విషయంపై ఇక్కడి ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. సో.. ఇవన్నీ పరిశీలిస్తే.. ఓ రెండు మూడు నియోజకవర్గాలు.. మినహా.. ఎక్కడా వైసీపీకి సానుభూతి లభించడం లేదు. దీనిని బట్టి వైసీపీది బలుపో.. వాపో అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 3, 2021 7:44 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…