తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ కోసం ముహూర్తం పెట్టేసినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కటే వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్ కేబినెట్లో కేసీఆర్ కాకుండా ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్ను భర్తరఫ్ చేశారు. ఇప్పటికే కేసీఆర్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.
చివరి ఆరు నెలలు వదిలేస్తే మరో రెండేళ్ల పాలన మాత్రమే ఉంటుంది. ఈ సారి కేబినెట్ ఎన్నికల కేబినెట్ అవుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ అప్పటి వరకు ఉండరని.. గత అసెంబ్లీని 9 నెలల ముందుగానే రద్దు చేసి ఎలా అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లారో ఇప్పుడు కూడా అదే చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ సారి ఎన్నికల కేబినెట్కు గట్టిగా రెండు సంవత్సరాల టైం కూడా ఉండదు.
ఈ సారి కేసీఆర్ తన కేబినెట్లో భారీ మార్పులు, చేర్పులు చేస్తారని తెలుస్తోంది. సమర్థులు అయిన నేతలకే పెద్ద పీఠ వేస్తారని అంటున్నారు. ఆగస్టులో కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. ఆగస్టు శ్రావణ మాసం కావడంతో అది కలిసొస్తుందని… ఇప్పటికే పండితులతో చర్చించినట్టు సమాచారం.
ఈటల రాజేందర్ స్థానంలో ఎలాగూ కొత్త మంత్రిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈటల ప్లేస్ను భర్తీ చేయడంతో పాటు పనితీరు ఏ మాత్రం సరిగా లేదని భావిస్తోన్న మరో ముగ్గురు మంత్రులు అయితే ఖచ్చితంగా కేబినెట్ నుంచి బయటకు వెళ్లిపోతారనే అంటున్నారు.
ఈ లిస్టులో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఓ మంత్రితో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన మరో మంత్రి, దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేరు వినిపిస్తోంది. గ్రేటర్కు చెందిన మంత్రి తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి.
అలాగే ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో సీఎం కుమార్తె కవిత ఓటమికి కారణమయ్యారని ఓ మంత్రి పై సైతం కేసీఆర్, కవిత గుర్రుగా ఉన్నారట. ఏదేమైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రుల మెడపై వేటు కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరిని ఉంచుతారో ? ఎవరిని తీసేస్తారో ? తెలియదు. కొత్తగా గుత్తా సుఖేందర్ రెడ్డి కేబినెట్లోకి రావడం దాదాపు ఖాయమే..!
This post was last modified on July 7, 2021 2:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…