ప్రధానమంత్రి నరేంద్రమోడితో జమ్మూ-కాశ్మీర్ నేతల సమావేశం కీలకమైనదనే చెప్పాలి. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నింటిలోను ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పారు. ఐదే ప్రతిపక్షాలు పట్టుబట్టిన అంశాలపై నరేంద్రమోడి సానుకూలంగా స్పంధిస్తారా అనేది మాత్రం డౌటనే చెప్పాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ నుండి లడ్డాఖ్ లోయను విడదీసిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమావేశం కాబట్టే దీనికి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది. సరే ఇక విషయంలోకి వస్తే జమ్మూ-కాశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా ఇవ్వాలని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ ఇవ్వాలని, కశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలనేది ప్రధాన డిమాండ్లు.
పై డిమాండ్లన్నింటిని ఒకసారి గమనిస్తే ఏదో మొక్కుబడిగా మోడి సర్కార్ రెండు అంశాలను మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయటం, కశ్మీరీపండిట్ల పునరావాసానికి చర్యల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి కాశ్మీర్లో రాజకీయ ఖైదీలనే వాళ్ళు పెద్దగా లేరనే చెప్పాలి. రెండేళ్ళక్రితం ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా చాలామందిని హౌస్ అరెస్టులు చేసింది కేంద్రం. ఈ మధ్యనే వాళ్ళను విడుదల కూడా చెసేసింది.
మోడితో భేటిలో కూడా అలాంటి నేతలు కొందరు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా లేదా ఎవరినైనా అరెస్టులు చేసున్నా వాళ్ళని విడుదల చేయటం కేంద్రం చేతిలో పనే కాబట్టి సమస్యలేదు. అలాగే కశ్మీరీ పండిట్లకు పునరావాస చర్యల విషయం కూడా పెద్ద కష్టమేమీకాదు. ఎందుకంటే ఆస్తులను వదులుకుని దశాబ్దాల క్రితమే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పండిట్ల కుటుంబాల్లో ఎంతమంది తిరిగి కశ్మీర్ కు తిరిగి వెళతారనేది డౌటే.
ఇక జమ్మూ-కశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా, వెంటనే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించటం, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ అనే విషయంలో మాత్రం అంత తొందరగా అంగీకరించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలని కేంద్రం అంటోంది. అదెప్పుడవుతుందో తెలీదు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వచ్చేంతవరకు పై అంశాల్లో మోడి సానుకూలంగా ఆలోచించే అవకాశాలు తక్కువే. మరి మోడి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on June 26, 2021 11:55 am
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…