Political News

డిమాండ్లను మోడి అంగీకరిస్తారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడితో జమ్మూ-కాశ్మీర్ నేతల సమావేశం కీలకమైనదనే చెప్పాలి. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నింటిలోను ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పారు. ఐదే ప్రతిపక్షాలు పట్టుబట్టిన అంశాలపై నరేంద్రమోడి సానుకూలంగా స్పంధిస్తారా అనేది మాత్రం డౌటనే చెప్పాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ నుండి లడ్డాఖ్ లోయను విడదీసిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమావేశం కాబట్టే దీనికి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది. సరే ఇక విషయంలోకి వస్తే జమ్మూ-కాశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా ఇవ్వాలని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ ఇవ్వాలని, కశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలనేది ప్రధాన డిమాండ్లు.

పై డిమాండ్లన్నింటిని ఒకసారి గమనిస్తే ఏదో మొక్కుబడిగా మోడి సర్కార్ రెండు అంశాలను మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయటం, కశ్మీరీపండిట్ల పునరావాసానికి చర్యల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి కాశ్మీర్లో రాజకీయ ఖైదీలనే వాళ్ళు పెద్దగా లేరనే చెప్పాలి. రెండేళ్ళక్రితం ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా చాలామందిని హౌస్ అరెస్టులు చేసింది కేంద్రం. ఈ మధ్యనే వాళ్ళను విడుదల కూడా చెసేసింది.

మోడితో భేటిలో కూడా అలాంటి నేతలు కొందరు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా లేదా ఎవరినైనా అరెస్టులు చేసున్నా వాళ్ళని విడుదల చేయటం కేంద్రం చేతిలో పనే కాబట్టి సమస్యలేదు. అలాగే కశ్మీరీ పండిట్లకు పునరావాస చర్యల విషయం కూడా పెద్ద కష్టమేమీకాదు. ఎందుకంటే ఆస్తులను వదులుకుని దశాబ్దాల క్రితమే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పండిట్ల కుటుంబాల్లో ఎంతమంది తిరిగి కశ్మీర్ కు తిరిగి వెళతారనేది డౌటే.

ఇక జమ్మూ-కశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా, వెంటనే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించటం, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ అనే విషయంలో మాత్రం అంత తొందరగా అంగీకరించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలని కేంద్రం అంటోంది. అదెప్పుడవుతుందో తెలీదు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వచ్చేంతవరకు పై అంశాల్లో మోడి సానుకూలంగా ఆలోచించే అవకాశాలు తక్కువే. మరి మోడి ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on June 26, 2021 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…

3 hours ago

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

4 hours ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

4 hours ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

4 hours ago

పెద్దికి తొలగిన అడ్డంకులు

టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…

4 hours ago

నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం!

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…

4 hours ago