ప్రధానమంత్రి నరేంద్రమోడితో జమ్మూ-కాశ్మీర్ నేతల సమావేశం కీలకమైనదనే చెప్పాలి. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నింటిలోను ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పారు. ఐదే ప్రతిపక్షాలు పట్టుబట్టిన అంశాలపై నరేంద్రమోడి సానుకూలంగా స్పంధిస్తారా అనేది మాత్రం డౌటనే చెప్పాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ నుండి లడ్డాఖ్ లోయను విడదీసిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమావేశం కాబట్టే దీనికి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది. సరే ఇక విషయంలోకి వస్తే జమ్మూ-కాశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా ఇవ్వాలని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ ఇవ్వాలని, కశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలనేది ప్రధాన డిమాండ్లు.
పై డిమాండ్లన్నింటిని ఒకసారి గమనిస్తే ఏదో మొక్కుబడిగా మోడి సర్కార్ రెండు అంశాలను మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయటం, కశ్మీరీపండిట్ల పునరావాసానికి చర్యల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి కాశ్మీర్లో రాజకీయ ఖైదీలనే వాళ్ళు పెద్దగా లేరనే చెప్పాలి. రెండేళ్ళక్రితం ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా చాలామందిని హౌస్ అరెస్టులు చేసింది కేంద్రం. ఈ మధ్యనే వాళ్ళను విడుదల కూడా చెసేసింది.
మోడితో భేటిలో కూడా అలాంటి నేతలు కొందరు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా లేదా ఎవరినైనా అరెస్టులు చేసున్నా వాళ్ళని విడుదల చేయటం కేంద్రం చేతిలో పనే కాబట్టి సమస్యలేదు. అలాగే కశ్మీరీ పండిట్లకు పునరావాస చర్యల విషయం కూడా పెద్ద కష్టమేమీకాదు. ఎందుకంటే ఆస్తులను వదులుకుని దశాబ్దాల క్రితమే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పండిట్ల కుటుంబాల్లో ఎంతమంది తిరిగి కశ్మీర్ కు తిరిగి వెళతారనేది డౌటే.
ఇక జమ్మూ-కశ్మీర్ కు పూర్తిస్ధాయి రాష్ట్రహోదా, వెంటనే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించటం, స్ధానికులకు భూమిపై గ్యారెంటీ అనే విషయంలో మాత్రం అంత తొందరగా అంగీకరించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలని కేంద్రం అంటోంది. అదెప్పుడవుతుందో తెలీదు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వచ్చేంతవరకు పై అంశాల్లో మోడి సానుకూలంగా ఆలోచించే అవకాశాలు తక్కువే. మరి మోడి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on June 26, 2021 11:55 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…