మాజీ మంత్రి ఈటల రాజేందర్… ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన.. కారు దిగేసి.. కషాయం గూటికి చేరారు. ఈ క్రమంలో… ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. పలు రకాల ఆరోపణలుచేశారు. పార్టీ మారే క్రమంలో.. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే అని అందరూ అనుకున్నారు. అయితే.. సడెన్ గా ఈ రోజు ఈటల పేరిట.. సీఎం కేసీఆర్ ని క్షమాపణలు అడుగుతూ.. ఆయనను ఆకాశానికి పొగిడేస్తూ.. ఓ లేఖ బయటకు వచ్చింది.
ఈ లేఖ చూసిన వారంతా అందరూ షాకయ్యారు. అరె.. మొన్నే కదా తిట్టాడు.. మళ్లీ ఇప్పుడు ఈ పొగడ్తలేంది అనుకున్నారు. కానీ.. అది నిజమైన లేఖ కాదని ఫేక్ అని తేలిపోయింది.తనను క్షమించాలని, ఈ ఒక్కసారికి తమ్ముడిగా భావించి వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డట్లుగా ఆ లేఖలో ఉండటం గమనార్హం.
దీనిపై ఈటల పోలీసులకు కూడా కంప్లైట్ చేశారు. కానీ ఈ ఫేక్ లేఖలు అన్ని ఎక్కడనుండి వస్తున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది. కొందరు టీఆర్ఎస్ శ్రేణులే.. ఈ రకంగా లేఖలు క్రియేట్ చేసి.. ఈటలను ఫూల్ చేయాలని చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈటల పార్టీ మారే సమయంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసినప్పుడు కూడా.. గతంలో ఈటల వీడియోలను చూపించి ట్రోల్ చేశారు. ఇప్పుడు.. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్.. ఇలా ఫేక్ లేఖలు క్రియేట్ చేసిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఫేక్ లేఖ వెనక హస్తం ఎవరిదో.. పోలీసులే కనిపెట్టాలి.
This post was last modified on June 25, 2021 4:49 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…