మాజీ మంత్రి ఈటల రాజేందర్… ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన.. కారు దిగేసి.. కషాయం గూటికి చేరారు. ఈ క్రమంలో… ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. పలు రకాల ఆరోపణలుచేశారు. పార్టీ మారే క్రమంలో.. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే అని అందరూ అనుకున్నారు. అయితే.. సడెన్ గా ఈ రోజు ఈటల పేరిట.. సీఎం కేసీఆర్ ని క్షమాపణలు అడుగుతూ.. ఆయనను ఆకాశానికి పొగిడేస్తూ.. ఓ లేఖ బయటకు వచ్చింది.
ఈ లేఖ చూసిన వారంతా అందరూ షాకయ్యారు. అరె.. మొన్నే కదా తిట్టాడు.. మళ్లీ ఇప్పుడు ఈ పొగడ్తలేంది అనుకున్నారు. కానీ.. అది నిజమైన లేఖ కాదని ఫేక్ అని తేలిపోయింది.తనను క్షమించాలని, ఈ ఒక్కసారికి తమ్ముడిగా భావించి వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డట్లుగా ఆ లేఖలో ఉండటం గమనార్హం.
దీనిపై ఈటల పోలీసులకు కూడా కంప్లైట్ చేశారు. కానీ ఈ ఫేక్ లేఖలు అన్ని ఎక్కడనుండి వస్తున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది. కొందరు టీఆర్ఎస్ శ్రేణులే.. ఈ రకంగా లేఖలు క్రియేట్ చేసి.. ఈటలను ఫూల్ చేయాలని చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈటల పార్టీ మారే సమయంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసినప్పుడు కూడా.. గతంలో ఈటల వీడియోలను చూపించి ట్రోల్ చేశారు. ఇప్పుడు.. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్.. ఇలా ఫేక్ లేఖలు క్రియేట్ చేసిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఫేక్ లేఖ వెనక హస్తం ఎవరిదో.. పోలీసులే కనిపెట్టాలి.
స్టార్ హీరో హీరోయిన్లు నటించకపోయినా.. పేరున్న దర్శకుడు తీయకపోయినా.. స్టన్నింగ్ విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి అంచనాలు పెంచిన సినిమా..…
తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక…
దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర హీరోగా ఆయన డైరెక్షన్లోనే రూపొందుతున్న కాంచన 4 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన…
పెద్ది విషయంలో ప్రీ రిలీజ్ నుంచి పోస్ట్ రిలీజ్ దాకా జరుగుతున్న ఒక పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు…
జూలై 3 నాగబంధం విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ డెవిల్ తీసిన నిర్మాత కం దర్శకుడు అభిషేక్ నామా మీద…
జూన్ సగం అయిపోయింది. మా ఇంటి బంగారం లాంటి నోటెడ్ మూవీస్ తో పాటు దీవానా లాంటివి అంతో ఇంతో…