మనదేశాన్ని వణికించేసిన డెల్టా వేరియంట్ ఇపుడు ప్రపంచంమీద పడింది. ప్రపంచంలోని సుమారు 85 దేశాలను డెల్టా వేరియంట్ వణికించేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రిటన్, రష్యా, స్పెయిన్, కెనడా లాంటి అనేక దేశాల్లో రెండు టీకాలను వేసుకున్న జనాలకు కూడా డెల్టా వేరియంట్ సోకుతుండటం. టీకాలు వేసుకున్నాం కదా ఇక మనకేం కాదు అని ధైర్యంగా బయట తిరిగేస్తున్న జనాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంఇది.
అగ్రరాజ్యం అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 20 శాతం ఈ డెల్టా వేరియంటే కారణమని నిర్ధారణవుతోంది. గడచిన నెలరోజుల్లో బ్రిటన్లో నమోదైన 50 వేల కేసుల్లో 38 వేలు డెల్టీ వేరియంట్ కేసులే అంటే దాని తీవ్రత ఎలాగుందో అర్ధమైపోతోంది. రష్యాలో అయితే గురువారం ఒక్కరోజే డెల్టా వేరియంట్ కారణంగా 548 మంది చనిపోయారు.
ప్రపంచదేశాల్లో పెరుగుతున్న కేసుల తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్ఓ) కూడా డెల్టా వేరియంట్ గురించి అత్యవసరమైన ప్రకటనలు చేస్తోంది. కరోనా వైరస్ సమస్య తగ్గిపోయింది కదాని లేకపోతే రెండు టీకాలు వేసుకున్నాం కదానే నిర్లక్ష్యంతో ఉండవద్దని జనాలకు పదే పదే మొత్తుకుంటోంది. జనాల నిర్లక్ష్యమే కేసుల తీవ్రతకు ప్రధాన కారణంగా డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నారు.
విచిత్రమేమిటంటే ఒకవైపు జనాలు టీకాలు వేసుకుంటున్నా మరోవైపు వైరస్ సోకుతునే ఉండటం. టీకాలు వేసుకున్నా తగిన జాగ్రత్తలు వహించకపోతే ఉపయోగం ఉండదని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా వింటున్న జనాలు పెద్దగా కనబడటంలేదు. ఇలా లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను సడలించాయో లేదో వెంటనే జనాలంతా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అవసరమున్నా లేకపోయినా రోడ్లపైకి వచ్చేస్తున్న జనాల్లో అత్యధికులు చదువుకున్న వాళ్ళే కావటం నిజంగా దురదృష్టమే.
This post was last modified on June 25, 2021 12:41 pm
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…