మనదేశాన్ని వణికించేసిన డెల్టా వేరియంట్ ఇపుడు ప్రపంచంమీద పడింది. ప్రపంచంలోని సుమారు 85 దేశాలను డెల్టా వేరియంట్ వణికించేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రిటన్, రష్యా, స్పెయిన్, కెనడా లాంటి అనేక దేశాల్లో రెండు టీకాలను వేసుకున్న జనాలకు కూడా డెల్టా వేరియంట్ సోకుతుండటం. టీకాలు వేసుకున్నాం కదా ఇక మనకేం కాదు అని ధైర్యంగా బయట తిరిగేస్తున్న జనాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంఇది.
అగ్రరాజ్యం అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 20 శాతం ఈ డెల్టా వేరియంటే కారణమని నిర్ధారణవుతోంది. గడచిన నెలరోజుల్లో బ్రిటన్లో నమోదైన 50 వేల కేసుల్లో 38 వేలు డెల్టీ వేరియంట్ కేసులే అంటే దాని తీవ్రత ఎలాగుందో అర్ధమైపోతోంది. రష్యాలో అయితే గురువారం ఒక్కరోజే డెల్టా వేరియంట్ కారణంగా 548 మంది చనిపోయారు.
ప్రపంచదేశాల్లో పెరుగుతున్న కేసుల తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్ఓ) కూడా డెల్టా వేరియంట్ గురించి అత్యవసరమైన ప్రకటనలు చేస్తోంది. కరోనా వైరస్ సమస్య తగ్గిపోయింది కదాని లేకపోతే రెండు టీకాలు వేసుకున్నాం కదానే నిర్లక్ష్యంతో ఉండవద్దని జనాలకు పదే పదే మొత్తుకుంటోంది. జనాల నిర్లక్ష్యమే కేసుల తీవ్రతకు ప్రధాన కారణంగా డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నారు.
విచిత్రమేమిటంటే ఒకవైపు జనాలు టీకాలు వేసుకుంటున్నా మరోవైపు వైరస్ సోకుతునే ఉండటం. టీకాలు వేసుకున్నా తగిన జాగ్రత్తలు వహించకపోతే ఉపయోగం ఉండదని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా వింటున్న జనాలు పెద్దగా కనబడటంలేదు. ఇలా లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను సడలించాయో లేదో వెంటనే జనాలంతా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అవసరమున్నా లేకపోయినా రోడ్లపైకి వచ్చేస్తున్న జనాల్లో అత్యధికులు చదువుకున్న వాళ్ళే కావటం నిజంగా దురదృష్టమే.
This post was last modified on June 25, 2021 12:41 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…