భారత ప్రధానిగా ప్రస్తుతం నరేంద్రమోడీ కొనసాగుతున్నారు. ఆయన కాకుండా.. భవిష్యత్తులో ఆ పదవిని అదిరోహించేంది ఎవరు..? అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికైనా ఉందా..? కాంగ్రెస్ ఈసారైనా నిలపడగలదా..? లేదా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటై.. అది బీజేపీ ని ఓడించగలదా..? వంటి ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడింది ప్రశ్నం అనే సంస్థ. ఈ మేరకు 12 రాష్ట్రాల్లో సర్వే కూడా చేసింది.
ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, బీహర్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల్లో 397లోక్ సభ స్థానాల పరిధిలోని 2,309 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20వేల మందిని సర్వే చేశారు. ఎవరు మోడీకి ధీటుగా నిలబడి ప్రధాని కాగలరు అన్నది సర్వేలో ప్రశ్న.
భవిష్యత్తులో ఎవరు పీఎంగా ఉంటే బాగుంటుందనే ప్రశ్నని సర్వేలో ఉంచగా… ఈ సర్వేలో ప్రధానిగా మళ్లీ మోడీ నే ఉండాలని 32.8శాతం మంది ఓటేయగా, రాహుల్ గాంధీ వైపు 17.2శాతం మంది ఓటేశారు. ఇక థర్డ్ ఫ్రంట్ కూటమి ప్రయత్నాల్లో ఉన్న శరద్ పవార్ ను కేవలం 0.9శాతం మంది ఎంపిక చేయగా… మమతా బెనర్జీ వైపు 7శాతం ఓటేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కేవలం 0.7శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అంటే మోడీ తర్వాత జనం రాహుల్ వైపే మొగ్గుచూపుతున్నారు.
This post was last modified on June 23, 2021 11:08 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…