కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆగిపోయిన ప్రజా రవాణాను పునరుద్ధరించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో బస్సులు పున:ప్రారంభం కాగా.. వలస కార్మికుల కోసం కొన్ని వారాల కిందటే రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లనూ నడపడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు పున:ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 200 నాన్ ఏసీ సెకండ్ క్లాస్ రైళ్లను తొలి దశలో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.
ప్రయాణికులు ఈ రైళ్ల టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని.. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే.
త్వరలోనే ఈ ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి టైం టేబుల్ కూడా విడుదల చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ 200 రైళ్లలో ప్రయాణానికి అనుమతి ఇవ్వనుండగా.. రైల్వే కౌంటర్ల దగ్గర వీటికి టికెట్ బుకింగ్ అవకాశం లేదని రైల్వే శాఖ ప్రకటించింది.
స్టేషన్లలో టికెట్ల కౌంటర్లు తెరిస్తే భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని.. కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుందని అందుకు అవకాశం లేకుండా చూస్తున్నారు. ఈ రైళ్లలో బోర్డింగ్, సీటింగ్ విషయంలోనూ షరతులుంటాయి. భౌతిక దూరం పాటిస్తూ రైలు ఎక్కాలి. ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు కూడా కొంచెం భిన్నంగా ఉండబోతోంది. దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచి కొన్ని నెలల్లో రవాణాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
This post was last modified on May 20, 2020 2:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…