క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్షత్రియ సామాజికవర్గం తాజాగా జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2019 ఎన్నికల్లో క్షత్రియ సామాజికవర్గం దాదాపు వైసీపీకి మద్దతుగా నిలబడింది. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ళల్లోనే జగన్ పై సామాజికవర్గం పెద్దల్లో అసంతృప్తి బయలుదేరటానికి కారణాలు ఏమిటి ?
ఏమిటంటే కచ్చితంగా జగన్ వ్యవహారశైలి అయితే కాదు. కాకపోతే కొందరు మంత్రులు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ అత్యుత్సాహం వల్లే జగన్ కు తలనొప్పులు మొదలవుతున్నాయి. ఇలాంటి వీళ్ళను కంట్రోల్ చేయకపోతే మాత్రం క్షత్రియసామాజికవర్గం రివర్సవటం ఖాయమనే అనిపిస్తోంది.
మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టులో కేసు గెలిచి మళ్ళీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ పై వెల్లంపల్లి, విజయసాయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అశోక్ పై పోర్జరీ కేసుందని, భూములను అమ్ముకుంటున్నారని, అశోక్ ను విడిచిపెట్టే సమస్యేలేదని, తొందరలోనే అశోక్ ను జైలుకు పంపటం ఖాయమని ఏమిటేమిటో మాట్లాడుతున్నారు.
అశోక్ టీడీపీ నేతయ్యుండచ్చు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయీ ఉండచ్చు. అంతమాత్రాన అశోక్ ను తేలిగ్గా తీసుకునేందుకు లేదు. ఎందుకంటే అశోక్ వెనకాల బలమైన సామాజికవర్గముంది. పార్టీలకు అతీతంగా మాజీ ఎంపిని అందరు గౌరవిస్తారు. అలాగే విజయనగరాన్ని పరిపాలించిన వంశంగా అశోక్ కుటుంబానికి మంచి పేరుంది. గడచిన 35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. సాధ్యమైనంత వరకు అశోక్ కూడా ఎవరి జోలికి వెళ్ళరు.
ఇన్ని ప్లస్ పాయింట్లున్నాయి కాబట్టే పూసపాటి కుటుంబమంటే తెలుగురాష్ట్రాల్లోని క్షత్రియ కుటుంబాల్లో మంచి గౌరవం, మర్యాదా ఉన్నాయి. ఇలాంటి అశోక్ ను పట్టుకుని విజయసాయి, వెల్లంపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడేసరికి సామాజికవర్గానికి మండింది. అందుకనే తమ మనోభావాలను తెలియజేస్తు జగన్ కు లేఖ రాశారు. మళ్ళీ ఇదే సామాజికవర్గం వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు విషయంలో స్పందించలేదు. అది పూర్తిగా రాజకీయ వ్యవహారంగా చూశాయి. కాబట్టి ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో డ్యామేజీ తప్పేలా లేదు.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…